హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడీమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరాతాబాద్తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.
క్షేత్రస్థాయిలో పర్యటించిన దాన కిశోర్
హైదరాబాద్, ఈవార్తలు : హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. శేరిలింగంపల్లి నెక్టర్ గార్డెన్ , ఖైరతాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. రోడ్లపైనే వరద నీరు ఉండటం చూసి ఎప్పటికప్పుడు నీటిని క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి పరిధిలోని నెక్టర్ గార్డెన్ వద్ద వరద నీటి వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.6 కోట్లతో 30 లక్షల లీటర్ల కెపాసిటీతో నీటి సంపును నిర్మించాలని, మరో రూ.7 కోట్లతో నాళాలను నిర్మించాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించి 45 రోజుల్లో పనులు పూర్తి చేయాలని అన్నారు.
అటు.. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడీమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరాతాబాద్తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం డైరెక్టర్ తో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గాలులకు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారులను ఆదేశించారు.