తెలంగాణలో పంపిణీ కోసం గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. భారీగా డబ్బు మారటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారంతో పీఎంఎల్ఏ చట్టం (మనీలాండరింగ్) కింద దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో పంపిణీ కోసం గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. భారీగా డబ్బు మారటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారంతో పీఎంఎల్ఏ చట్టం (మనీలాండరింగ్) కింద దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్కు లేఖ రాసింది. ప్రస్తుతం ఈ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈడీ కూడా రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.