BRS | లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా బస్సు యాత్రను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు.
హైదరాబాద్, ఈవార్తలు న్యూస్: బీఆర్ఎస్ పూర్వ వైభవానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపటంతో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన కార్యక్రమాలు, వాటి వల్ల కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించనున్నారు. యాత్ర కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కేసీఆర్ బస్సు యాత్ర పర్మిషన్ కోసం ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ ను కలిసి వివరాలు అందజేశారు. యాత్రకు సంబంధించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో పోలీసుల సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని, సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
"కేసీఆర్ బస్సు యాత్ర" పర్మిషన్ కోసం ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ ను కలిసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
— BRS Party (@BRSparty) April 19, 2024
మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి టూర్ ప్రోగ్రామ్ కు సంబంధించి పార్టీ ప్రతినిధిగా… pic.twitter.com/n9WMhOIUII