ధర్మరక్షణకే బజరంగ్ దళ్ లక్ష్యం: విశ్వహిందూ పరిషత్తు

హిందూ ధర్మ పరిరక్షణ కోసమే బజరంగ్ దళ్ ఆవిర్భవించిందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామ్ సింగ్, రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు బజరంగ్ దళ్ నిరంతరం సంఘర్షణ చేస్తోందని వివరించారు.

vhp balaswamy

సమావేశంలో మాట్లాడుతున్న బాలాస్వామి

ఈవార్తలు, హైదరాబాద్ : హిందూ ధర్మ పరిరక్షణ కోసమే బజరంగ్ దళ్ ఆవిర్భవించిందని విశ్వహిందూ పరిషత్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామ్ సింగ్, రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు.  భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు బజరంగ్ దళ్ నిరంతరం సంఘర్షణ చేస్తోందని వివరించారు.  ప్రతి బజరంగ్ దళ్ కార్యకర్త తన మన ధన పూర్వకంగా ధర్మకార్యంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠ పురం శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరంలో బజరంగ్ దళ్ భారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 600 మంది కార్యకర్తలు త్రిశూల్ దీక్ష పొందారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ధర్మకార్యంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. హిందూ అమ్మాయిలను చెర బట్టి, మతమార్పిడి చేసే దుర్మార్గుల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. మాయమాటలు చెప్పి మతమార్పిడికి పాల్పడే దుండగులకు తగిన బుద్ధి చెప్పే విషయంలో ముందుండాలని సూచించారు. దేవాలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయని, దేవాలయాల విషయంలో పాలకుల వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి స్వార్థపూరిత పాలకుల కుట్రలను ఎండగట్టాలన్నారు. ముక్కోటి దేవతలకు నిలయమైన గోవులను రక్షించి ధర్మాన్ని నిలబెట్టాలన్నారు. ప్రతి గ్రామానికి ఒక ఆంజనేయ స్వామి మందిరం ఏ విధంగా ఉంటుందో .. అదేవిధంగా ప్రతి గ్రామానికి బజరంగ్ దళ్ కార్యకర్త అవసరం కూడా ఉందన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణ, పట్టుదలతో జీవితంలో రాణించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు సూచించారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంస్కారం అన్ని విషయాలలో బజరంగ్ దళ్ కార్యకర్త సమాజానికి ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. పేద, ధనిక, నిమ్న ,అగ్ర వర్ణాల  భేదం  లేకుండా హిందువులంతా సంఘటితమై నిలబడాలని పేర్కొన్నారు. అందుకు బజరంగ్ దళ్ కార్యకర్త మూల స్తంభం అన్నారు. సమాజంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్, లోన్ యాప్స్ ద్వారా అత్యధికంగా హిందువులే నష్టపోతున్నారని.. ఈ విషయంపై హిందూ యువత జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. కుటుంబ విలువలు పాటిస్తూ.. సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలన్నారు.  విధర్మీయుల దాడిని ఎదుర్కొనేందుకు త్రిశూల్ దీక్ష ఉపయోగపడుతుందని చెప్పారు. ధర్మరక్షణ విషయంలో చత్రపతి శివాజీ, చత్రపతి శంభాజీ మహారాజుల వీర పోరాటం.. బలిదానం ప్రతి హిందూ యువకిశోరాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. రాబోవు రోజుల్లో హిందువుల మధ్య ఐక్యత రాగం పెంచి, ధర్మాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని సూచించారు. అంతకుముందు అయోధ్య రాముడు, ఆంజనేయస్వామి, భరతమాత చిత్రపటాలకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. త్రిశూల్ దీక్ష తీసుకున్న యువకిశోరాలపై వేద పండితులు ప్రత్యేకంగా కురిపించిన పూలవర్షం ఆకర్షణగా నిలిచింది. కార్యకర్తలు జైశ్రీరామ్ నినాదాలతో సభ ప్రాంగణాన్ని మార్మోగించారు. మహిళలు పెద్దలు  భారీ సంఖ్యలో హాజరై హిందూ సంఘటన కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషం. విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రసార్ రాష్ట్ర సహ ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ త్రిశూల్ దీక్ష అవసరం, దాని గొప్పదనం గురించి వివరించారు. ప్రతి కార్యకర్త నిష్టతో ధర్మం కోసం పనిచేయాలన్నారు.  కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర ప్రశిక్షణ ప్రముక్ ముఖేష్, శ్రీధర్ గౌడ్, బజరంగ్ దళ్  సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్