నేటి నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు.. టైమింగ్స్ ఇవే.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొద్ది రోజుల నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మార్చి రెండో వారంలో ఉండగానే భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒంటి పూట బడులు శనివారం నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించేలా ఆదేశాలు వచ్చాయి. వేసవికాలం నేపథ్యంలో ఈరోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొద్ది రోజుల నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మార్చి రెండో వారంలో ఉండగానే భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒంటి పూట బడులు శనివారం నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించేలా ఆదేశాలు వచ్చాయి. వేసవికాలం నేపథ్యంలో ఈరోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణలో గడిచిన నాలుగు వారాల నుంచి ఎండలో తీవ్రంగా ఉన్నాయి. మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహించడానికి నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లో విద్యార్థులు ఉండడం వల్ల ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.

ఈ ఇబ్బందులకు పరిష్కారంగా ఒంటి పూట బడులను వేగంగా ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్నారు. పాఠశాలలు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏళ్లలోనే ఉండడం వల్ల సేద తీరేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి తాపం ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు ఇళ్లల్లో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమవుతున్న ఒంటి పూట బడులు ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులు ఒంటిపోట బడుల తర్వాత ఇంటి వద్ద మధ్యాహ్నం ఉండాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు వెళ్ళనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళితే డిహైడ్రేట్ అయ్యి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు నీటితోపాటు మజ్జిగ వంటివి తీసుకునేలా చూడాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్