తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ శనివారం భేటీ కానుంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్ భేటీ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ శనివారం భేటీ కానుంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్ భేటీ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధి విధానాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రైతు భరోసాపై కసరత్తు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కొర్రీలు లేని భరోసా కావాలంటు విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో దీనిపై చర్చ జరగనున్నట్లు చెబుతున్నారు. ఇదే ప్రధాన అంశంగా క్యాబినెట్ భేటీలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. రైతు భరోసా పై ముఖ్యమంత్రి నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నదానిపైన ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అలాగే ఈ భేటీలో పంట సాగు చేసే ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు అనుగుణమైన నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డులకు మంజూరు, సన్న బియ్యం పంపిణీ వంటి అంశాలపైన భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీలో ఇసుక, స్టీల్, సిమెంటు వంటివి సరఫరా చేసే అంశంపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ కు గణాంకాలు ఇచ్చేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న దానిపైన చర్చించి నిర్ణయం తీసుకోనన్నారు. ఏది ఏమైనా శనివారం జరగనున్న క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.