మిర్చి రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనబడడం లేదా.. ప్రశ్నించిన వైయస్ జగన్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పండించిన పంటకు పది పదకొండు వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితికి చేరుకున్నారని విమర్శించారు. రైతులు ఒకవైపు తెగుళ్లు వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో చేతికి రాలేదన్నారు.

YS Jaganmohan Reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఉదయం 10:30 ప్రాంతంలో గుంటూరు మిర్చి యార్డుకునేందుకు ఆయన వచ్చారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మిర్చి రైతులతో మాట్లాడేందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు ఘన స్వాగతం పలికారు. దారి పొడువున వేలాదిమంది జనం రావడంతో ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అతి కష్టం మీద మిర్చి యార్డుకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడున్న మిర్చి రైతులతో మాట్లాడారు. గత ఏడాది ఎంత ధర ఉంది.? ఇప్పుడు ఎంత ధర ఉందన్న విషయాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. గడిచిన ఏడాదితో పోలిస్తే సుమారు పదివేల రూపాయలు ధర తగ్గుముఖం పట్టినట్లు రైతులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పండించిన పంటకు పది పదకొండు వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితికి చేరుకున్నారని విమర్శించారు. రైతులు ఒకవైపు తెగుళ్లు వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో చేతికి రాలేదన్నారు.

గతేడాది 27,000 పలికిన పంట.. ఏడాది 10 వేలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు దీనంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులు ప్రస్తుతం బతకడానికి కూడా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట వేసిన రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్రాన్ని దళారులకు అప్పగించేసారని విమర్శించారు. వైసిపి హయాంలో చేపట్టిన సంస్కరణలు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. ఆర్.బి.కె వ్యవస్థ నిర్వీర్యమైంద ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు తమ పంటలు అమ్ముకోవాలనుకుంటే నేరుగా ఆర్.బి.కె కి వచ్చి అమ్ముకునే వారిని పేర్కొన్నారు. గతంలో ధాన్యాన్ని స్థానం కొనుగోలు చేశామని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరను కల్పించామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడ గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర అందించే ఆలోచన కూడా లేకుండా పోతుందన్నారు. సచివాలయానికి కూత వేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు అవస్థలు పడుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చంద్రబాబుకు రైతుల కష్టాలు కనిపించిన కళ్ళు మూసుకుని రైతులను కష్టాలు పాలు చేస్తున్నాడని విమర్శించారు. 

రోడ్డు మీదకు వచ్చిన జగన్.. ఇక పోరేనా 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. ఈ పరామర్శకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని చూసినందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ప్రజలను అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేదు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తుండడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కత్తి మీద సాముగా మారుతుంది. మళ్లీ బుధవారం జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వస్తుండడంతో భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టినట్టేనని చెబుతున్నారు. ఇకపై ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం సాగించేలా ఆయన సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులకు సంబంధించిన పరామర్శలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 20వ తేదీన పాలకొండకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత తండ్రి పాలవలస రాజశేఖర్ మృతి చెందారు. వారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి పాలకొండకు బయలుదేరి వెళ్తారని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్