అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఐదు నెలల కిందట అంతరిక్ష పర్యటనకు వెళ్ళిన ఆమె సాంకేతిక లోపాలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ (59) ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కిపోయి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చిక్కిపోయి కనిపిస్తున్న సునీత విలియమ్స్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఐదు నెలల కిందట అంతరిక్ష పర్యటనకు వెళ్ళిన ఆమె సాంకేతిక లోపాలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ (59) ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కిపోయి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్న సునీత విలియమ్స్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చిక్కిపోయి కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 24వ తీసిన ఫోటోలో బాగా బరువు తగ్గిపోయి కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఆమె స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన ఆమె తిరిగి రావాల్సి ఉంది. పది రోజుల షెడ్యూల్ ప్రకారం ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అయితే, వ్యోమనౌక హీలియం లీకేజీ వల్ల తిరుగు ప్రయాణం సాధ్యం కాలేదు. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో వచ్చే ఫిబ్రవరిలో ఆమెను భూమికి తీసుకురానున్నట్లు నాశ ప్రకటించింది. ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు నాసా ప్రకటన చేసినప్పటికీ.. రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
నాసాలోని విశ్వసినీయ వర్గాలు వెల్లడించిన దాని ప్రకారం.. వ్యోమగాములు రాదశలో ఉండగా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన ఐక్యలరీ ఆహారాన్ని ఆమె తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఎక్కువ కాలం పాటు రోదసిలో ఉంటే ఆ ప్రభావం వ్యోమగాముల ఆరోగ్యంపై పడుతుంది. పురుషులతో పోలిస్తే మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై ఆ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. బరువు కోల్పోవడం, కండరాలు దెబ్బ తినడం, ఎముకలు బోలుగా మారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్ ఈ తరహా సమస్యలతో బాధపడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. సునీత కోల్పోయిన బరువును తిరిగి పొంది మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3,500 నుంచి 400 క్యాలరీల ఆహారం తీసుకోవాలని నాసా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ స్థాయిలో ఆమె ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే ఇబ్బంది ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నెలల తరబడి ఉండడం వల్ల కూడా ఆమె ఆరోగ్యం బలహీన పడినట్లు చెబుతున్నారు. అయితే, ఆమె ఇప్పటికే మానసికంగా ధైర్యంగా ఉన్నట్టు నాసా అధికారులు చెబుతున్నారు. ఇది కొంతలో కొంత ధైర్యాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో మూడు నెలలపాటు ఆమె అంతరిక్షంలోనే గడపాల్సి ఉంటుంది. అప్పటివరకు ఆమె ధైర్యంగా ఉండడంతో పాటు రోజువారి ఆహారాన్ని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆమె పూర్తి ఆరోగ్యంగా మళ్ళీ భూమిపై అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.