ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో 70 గంటలు పని చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నారాయణమూర్తి దేశం అభివృద్ధి బాటలో పయనించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం 70 గంటలకు మించి పని చేయాలంటూ సూచించారు. ఈ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తి తగ్గుతుందంటూ పలువురు నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సాహంతో చేయాలనుకుంటే సమయం ఎప్పుడు పరిమితంగా మారదని వ్యాఖ్యానించారు.
సుధా మూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలో 70 గంటలు పని చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నారాయణమూర్తి దేశం అభివృద్ధి బాటలో పయనించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం 70 గంటలకు మించి పని చేయాలంటూ సూచించారు. ఈ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తి తగ్గుతుందంటూ పలువురు నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సాహంతో చేయాలనుకుంటే సమయం ఎప్పుడు పరిమితంగా మారదని వ్యాఖ్యానించారు. ఒక పొరము ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి వ్యాఖ్యలపైన ఆమె స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రజలు ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సాహంగా చేయాలనుకుంటే దానికి సమయం ఎప్పుడు పరిమితిగా మారదని స్పష్టం చేశారు. తన భర్త డబ్బులు లేని సమయంలో కూడా ఇన్ఫోసిస్ ను నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పుడు అంకితభావం కలిగిన వ్యక్తులతో కలిసి 70 గంటలు అంతకంటే ఎక్కువ సమయం పని చేయడం వల్లే అది సాధ్యమైంది అన్నారు. నా భర్త మాత్రమే కాదు జర్నలిస్టులు, డాక్టర్లు వంటి ఇతర రంగాల్లోని వారు కూడా 90 గంటలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. భగవంతుడు అందరికీ రోజుకు 24 గంటలు సమయమే ఇచ్చాడని, ఈ సమయాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటున్నారు అనేది వారి ఇష్టం అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే ఉన్నత స్థానాలను చేరుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ను చూసుకున్నప్పుడు తాను ఇంటి బాధ్యతలను తీసుకున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో తాను ఇంటిని చూసుకోవడం, పిల్లలను పెంచడంతోపాటు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను తన భర్త కంటే ఓవర్ టైం పనిచేస్తున్నానని, దానికి ఆయన వెనుక నుంచి సపోర్టుగా ఉండి ముందుకు నడిపిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి మహిళా విజయం వెనుక అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉంటారని ఆమె పేర్కొన్నారు. వృత్తి జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు సాయం చేసుకోవాలని అదే జీవితమని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్ లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని గతంలో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుధా మూర్తి ఈ విధంగా వ్యాఖ్యానించారు. నారాయణమూర్తి 70 గంటల పాటు పనిచేయాలని మీ వ్యాఖ్యానించగా ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం 90 గంటల పాటు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సుధా మూర్తి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే ఉన్నత స్థితికి చేరుకుంటారు అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానించారు.