రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు.. పిఆర్సిపి ప్రకటన ఆలస్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పిఆర్సి కమిషన్ గడువు గ తేడాది ఏప్రిల్ రెండో తేదీతో ముగిసింది. కమిషన్ చైర్మన్ శివ శంకర్ ఈ మేరకు ప్రభుత్వానికి లేక కూడా రాశారు. ఈ లేఖలో కమిషన్ మరో నాలుగు నెలల నుంచి ఆరు నెలలపాటు పొడిగించాలని సూచించారు. గతంలో 2023 అక్టోబర్ 2న కమిషన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. అయితే పలు కారణాలతో ఎప్పటికీ పలుమార్లు గొడుగు పొడిగించబడింది. తాజా అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఉంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పిఆర్సి కమిషన్ గడువు గ తేడాది ఏప్రిల్ రెండో తేదీతో ముగిసింది. కమిషన్ చైర్మన్ శివ శంకర్ ఈ మేరకు ప్రభుత్వానికి లేక కూడా రాశారు. ఈ లేఖలో కమిషన్ మరో నాలుగు నెలల నుంచి ఆరు నెలలపాటు పొడిగించాలని సూచించారు. గతంలో 2023 అక్టోబర్ 2న కమిషన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. అయితే పలు కారణాలతో ఎప్పటికీ పలుమార్లు గొడుగు పొడిగించబడింది. తాజా అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఉంది. ఉద్యోగులకు కొత్త పిఆర్సి అమలు గురించి అనేక సందేహాలు కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గడువు మరోసారి పెంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వేతన సవరణ కోసం నిరీక్షణలో ఉన్న ఉద్యోగులు, త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని ఆశిస్తున్నారు. గడిచిన ఏడాదికాలం నుంచి ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్నప్పటికీ కొత్త పిఆర్సి అమలు గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. ఇప్పటికైనా కొత్త పిఆర్సి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని పలువురు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అయితే దీనికి అనుగుణంగా అడుగులు ముందుకు పడకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు చెబుతున్నారు. 

నూతన వేతన సవరణ ప్రక్రియ పూర్తయితే ఉద్యోగులకు మేలు చేకూరుతుందన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘ నేతలు తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. నూతన వేతన సవరణ ప్రక్రియ పూర్తయ్యాలా చూడాలంటూ ఉద్యోగులు ఉద్యోగ సంఘ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. గతంలో కమిషన్ చైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి పలువురు ప్రస్తావిస్తున్నారు. ఏడాది కిందట పిఆర్సి కమిషన్ గడువు పూర్తయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల తాము ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు బలంగా ప్రయత్నాలు సాగిస్తేనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని పలువురు పేర్కొంటున్నారు. మరి దీనిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ పెద్దలను కలిసినందుకు ఉద్యోగ సంఘ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి వీరికి ప్రభుత్వం ఎటువంటి హామీని ఇస్తుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్