తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ నెల 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెలుసుకున్నాయి.. పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పించింది. ఎప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్షల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజులపాటు ఈ దర్శనాలు కొనసాగులు ఉన్నాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ నెల 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెలుసుకున్నాయి.. పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పించింది. ఎప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్షల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజులపాటు ఈ దర్శనాలు కొనసాగులు ఉన్నాయి. ఈనెల 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమలలో అన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు టిటిడి అధికారులు చేశారు. ఈనెల 19తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు. శ్రీవారి సర్వదర్శనాలను ఎప్పటి నుంచి అనుమతించేది టిటిడి అధికారులు వెల్లడించారు.
ఈనెల 20వ తేదీ నుంచి స్వామి వారి సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు 19న ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయనున్నారు. సర్వదర్శనం క్యూలైన్లలో నేరుగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. 19వ తేదీన ఆన్లైన్లో కూడా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. ఈనెల 20న ప్రోటోకాల్ భక్తులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనం కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈయన పద్యంలోనే 19 విఐపి బ్రేక్ దర్శనం కోసం సిఫార్సులను స్వీకరించబవని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఏ రోజుకు ఆరోజు జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. చాలా రోజుల తర్వాత సర్వదర్శనానికి సంబంధించిన ఏర్పాటును అధికారులు చేస్తూ ఉండడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.