తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు.. నేడు ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ

తెలంగాణ ప్రజలకు అత్యధిక వైద్య సేవలు అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.54 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చతిస్గడ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రజలకు అత్యధిక వైద్య సేవలు అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.54 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చతిస్గడ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకు అనుగుణంగానే ఆసుపత్రికి నూతన భవనాన్ని నిర్మించేందుకు శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి అఫ్జల్ గంజ్ లో ఉండగా.. నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించబోతున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నారు. 26 ఎకరాలు విస్తీర్ణంలో రూపుదిద్దుకోబోతున్న ఈ భవనం కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలధాన్యాల ఉంటుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆసుపత్రి నూతన భవనం రానున్న వందేళ్లపాటు ప్రజల అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దీలా ప్రత్యేక ప్రణాళికతో దీనిని నిర్మాణం చేపడుతున్నారు.

దీనిపై ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ పెట్టారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, ప్రతి ఆపరేషన్ థియేటర్కు ఒక పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఉండనున్నాయి. కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా ల్యాబ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.2,700 కోట్లు వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనావేసింది. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20 శాతం వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా వైద్యుల నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఎప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. నూతన ఆసుపత్రి భవనం అందుబాటులోకి వస్తే రోజుకు 5000 మంది వరకు ఓపి రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. 30 విభాగాలతో రోబోటిక్స్ సర్జరీలు చేపట్టే విధంగా అత్యాధునిక సౌకర్యాలను ఈ నూతన భవన సముదాయంలో కల్పించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయం 11.54 గంటలకు చేయనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్