సోషల్ మీడియా ఖాతాలని కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి.. ఏప్రిల్ ఒకటి నుంచి అమలు.!

వాట్సాప్ సహా సోషల్ మీడియా ఖాతాలని ఇక కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు -2025 ప్రవేశపెట్టడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతో పాటు అక్రమార్కులకు అడ్డుకట్ట వేయను ఉందని ఆమె వెల్లడించారు. దీని ప్రకారం పాత నిబంధనలో మార్పులు చేయడంతో పాటు ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ సహా సోషల్ మీడియా ఖాతాలని ఇక కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు.  కొత్త ఆదాయపు పన్ను బిల్లు -2025  ప్రవేశపెట్టడానికి గల కారణాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతో పాటు అక్రమార్కులకు అడ్డుకట్ట వేయను ఉందని ఆమె వెల్లడించారు. దీని ప్రకారం పాత నిబంధనలో మార్పులు చేయడంతో పాటు ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు ప్రభుత్వం లెక్కల్లో చూపని డబ్బు, చట్ట విరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి వీలుకొరుగుతుందని పేర్కొన్నారు. భాషను సరళీకృతం చేయడం, అవసరమైన విభాగాలను తొలగించడం దీని లక్ష్యం.

అక్రమార్కులను పట్టుకునేందుకు మరిన్ని డిజిటల్ ఆధారాలు అన్వేషణకు ఇది మార్గం సుగమం చేయనుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 కింద డిజిటల్ ఆస్తులును ట్రాక్ చేయడంతో పాటు అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తుంది. నూతనంగా తీసుకువచ్చిన బిల్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టాక్స్ అమలను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రిప్టో కరెన్సీ ఇలాంటి వర్చువల్ ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా చూసుకునేందుకు సహాయపడుతుంది. డిజిటల్ ఖాతాలనుంచి వచ్చే ఆధారాలు అధికారులకు కోర్టులో పన్ను ఎగవేతన నిరూపించడానికి, పన్ను ఎగవేత మొత్తాన్ని కచ్చితంగా లెక్కించటానికి ఆధారాలను అందిస్తాయి. లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికి తీసేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ కీలక పాత్ర పోషిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొబైల్ ఫోన్లలో గుప్తీకరించిన సందేశాల ద్వారా లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బు బయటపడింది. క్రిప్టో ఆస్తులకు సంబంధించి వాట్సప్ సందేశాల నుంచి ఆధారాలు కనుగొన్నారు. గూగుల్ మ్యాప్స్ హిస్టరీ నగదు దాచడానికి తరచుగా సందర్శించే ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడిందని మంత్రి వెల్లడించారు. 

ఖాతాలను యాక్సెస్ చేసే అవకాశం అధికారులకు..

కొత్త బిల్లు అధికారులకు వాట్సప్, టెలిగ్రామ్, ఈ మెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫార్ములను యాక్సెస్ చేసే హక్కును కల్పిస్తుంది ఆర్థిక మంత్రి వివరించారు. అదనంగా ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్వేర్, సర్వర్లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుంది. ఈ బిల్లు వెల్లడించని ఆదాయం విషయంలో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కవర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ టోకెన్లు, క్రిప్టో కరెన్సీలు, క్విప్టో గ్రాఫిక్ వంటివి ఉంటాయి. ఇది పరిశోధన, స్వాధీన కార్యకలాపాల సమయంలో వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేసేందుకు ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిని ఇస్తుంది. ఇది మెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలో, ఆన్లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్సైట్లను కవర్ చేస్తుంది. పన్ను దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఖాతాల తనిఖీ కోసం యాక్సెస్ కోడ్లను రైడ్ చేసే అధికారాన్ని కూడా ఇది అధికారులకు ఇస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్