జగన్ ను వదలని షర్మిల.. ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ మరోసారి ట్విట్టర్ వేదికగా ఫైర్

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అబద్దాలను అందంగా అల్లడంలో రాటుదేలారని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో శుక్రవారం స్పందించారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

pcc president ys sharmila

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ షర్మిల

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అబద్దాలను అందంగా అల్లడంలో రాటుదేలారని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో శుక్రవారం స్పందించారు.  శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా.? అని షర్మిల ప్రశ్నించారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా.? అని నిలదీశారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే, ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా.? అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. 

ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ, ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదని,  రూ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారని షర్మిల ప్రశ్నించారు.  ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే, ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా.? అంటూ షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా.? అంటూ షర్మిల జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు.  దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమే.. అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని, అదానీ కలవడం ఒక చరిత్ర అని, రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర అని, గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర అని, ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా చరిత్ర అంటూ వైయస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యానించారు. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర అని, ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం AP రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర అని షర్మిల విమర్శించారు. ప్రపంచం మొత్తం ఇప్పడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్రకు నిదర్శనమని, భూగోళం అవినీతిపరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 

అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ లో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా అని ప్రశ్నించారు. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? అంటూ ఎద్దేవా చేశారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదని,  అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని, సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు AP చీఫ్ మినిస్టర్‌కి ఇచ్చారని తమ దర్యాప్తు లో కుండబద్దలు కొట్టాయని,  ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయని షర్మిల వెల్లడించారు. వివిధ సోర్స్ ల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించామని రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు PPL చేసుకుందని, రూ.35వేల కోట్ల భారం వేసిందని చెప్పే మీరు.. అధికారంలోకి వచ్చాక  గాడిదలు కాశారా.? అంటూ ఆరోపించారు. టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారని, ఎందుకు విచారణ జరిపించలేదని షర్మిల ప్రశ్నించారు. లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానీకి 25 ఏళ్లు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్ధమవుతోందని, గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన రూ.640 కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏపాటితో తెలిసిపోయిందని ఆరోపించారు. రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా  అదానీకి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయిందని షర్మిల విమర్శించారు. అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండని షర్మిల నిలదీశారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సవాల్‌ను స్వీకరించాలను పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్