వైసీపీలోకి సీనియర్ కాంగ్రెస్ నేతలు.. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి చేరికలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికలకు శుక్రవారం ముహూర్తం కూడా ఖరారు అయినట్లు చెబుతున్నారు. శుక్రవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తోపాటు ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారు అంటూ ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి శైలజనాథ్ మాత్రం శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం కన్ఫామ్ అయింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి బయటకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ జాబితాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతోపాటు రాజ్యసభలో ఎంపీలుగా ఉన్న నలుగురు కూడా పార్టీకి దూరమయ్యారు. మరి కొంతమంది పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసుగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీ శ్రేణులు ఢీలా పడ్డాయి. తీవ్ర అంతర్మదనంలో చిక్కుకున్న వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చే వార్త ఒకటి ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అదే వైసీపీలో చేరికలు ఇప్పటివరకు వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి గురించి మాత్రమే వింటూ వస్తున్న ఆ పార్టీ శ్రేణులకు ఈ వార్త పెద్ద ఊరటగానే చెప్పాలి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల్లోకి ఎన్నికలకు ముందు మాత్రమే భారీగా చేరికులు జరుగుతుంటాయి. అధికార పార్టీలోకి మాత్రం ఎప్పటికప్పుడు చేరుకులు ఉంటాయి. అధికారాన్ని అనుభవించే అవకాశం ఉండటమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో చేరడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. మరో నాలుగున్నర ఏళ్ల పాటు ప్రజలతో ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వంపై పోరాటాన్ని సాగించాలి.

అవసరమైతే ప్రభుత్వ వేధింపులను ఎదుర్కోవాలి. వీటన్నింటికీ సిద్ధపడి వైసిపిలో చేరేందుకు మాత్రం ఎవరు ముందుకు వస్తారు. కానీ వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధపడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికలకు శుక్రవారం ముహూర్తం కూడా ఖరారు అయినట్లు చెబుతున్నారు. శుక్రవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తోపాటు ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారు అంటూ ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి శైలజనాథ్ మాత్రం శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం కన్ఫామ్ అయింది. మిగిలిన నేతలు శుక్రవారం చేరుతారా.? మరో రోజు దానికి ఎంపిక చేసుకుంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీ ఉన్న తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో చేరికలు జరుగుతుండడం ఆ పార్టీ  శ్రేణులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కూడా చేరికలపై పెద్దగా దృష్టి సారించలేదు. రానున్న రోజుల్లో స్థానికంగా బలంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడం పై ఆయన దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలకు అవకాశాలను కల్పించేందుకు ఆయన ఈసారి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి రానున్న రోజుల్లో వైసీపీలో ఎవరెవరు చేరబోతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్