భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి జోరుగా ఏర్పాటు సాగుతున్నాయి. నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండడంతో పోలీసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా భాగ్యనగరంలో ఏటా నిర్వహిస్తూ వస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు నిమజ్జనానికి సంబంధించిన నిబంధనలను వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను వెల్లడించారు.
గణనాథుడి నిమజ్జనం
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి జోరుగా ఏర్పాటు సాగుతున్నాయి. నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండడంతో పోలీసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా భాగ్యనగరంలో ఏటా నిర్వహిస్తూ వస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు నిమజ్జనానికి సంబంధించిన నిబంధనలను వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో మూడు వేల మంది సిబ్బందిని గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదని వివరించిన సిపి.. మండపం నిర్వాహకులు నిబంధనలు మేరకు పోలీసులకు సహకరిస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరో ఎనిమిది వేల మంది సిబ్బందిని నిమజ్జనం బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మిలాద్ ఉన్ నబి కార్యక్రమం ఉన్నందున మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామని సిపి వివరించారు. ఈ నెల 17న పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్లో మరో కార్యక్రమం ఉందని సిపి ప్రకటించారు. నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులు నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఇవి పోలీసులు సూచించిన నిబంధనలు..
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు నిబంధనలను విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఒక విగ్రహానికి ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆవాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు. నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టంకు అనుమతి లేదు. రంగులు పిచికారి చేయడానికి కాన్ఫిట్టి గన్స్ వినియోగించకూడదు. మద్యం మత్తులో ఉన్న వారిని, మత్తు పదార్థాలు కలిగి ఉన్న వారిని విగ్రహం ఉన్న వాహనాల్లోకి అనుమతించరాదు. రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్ కు ప్రభావితం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఏదైనా ప్రార్థన స్థలం దగ్గర లేదా ఇతర వాహనాలకు లేదా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా ఆగకూడదు. అప్పటి పరిస్థితిని బట్టి వాహనాల రాకపోకలపై పోలీసు అధికారులు ఆదేశాలు ఇస్తారని వెల్లడించారు. ఊరేగింపులో ఎవరు కర్రలు, కత్తులు మారణాయుధాలు, మండే వస్తువులు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లకూడదు. జెండాలు అలంకరణ కోసం పెట్టే కర్రలు రెండు అడుగులకు మించకూడదు. ఊరేగింపులో ఎలాంటి రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలు నినాదాలు, రెచ్చగొట్టే సంకేతాలతో కూడిన బ్యానర్లు ఉపయోగించరాదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ఊరేగింపు సమయంలో బాణాసంచా కాల్చరాదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 100 కాల్ చేయాలి అని పోలీసులు నిబంధనలను విధించారు.