ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు.. సర్వర్ మొరాయింపులతో ఇక్కట్లు

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంతోమంది భావించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వద్ద రద్దీ భారీగా పెరిగింది. దీంతో అనేక చోట్ల సర్వర్లు మరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంతోమంది భావించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వద్ద రద్దీ భారీగా పెరిగింది. దీంతో అనేక చోట్ల సర్వర్లు మరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. ఎందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. చాలా చోట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్లు మొరాయించడంతో నిలిచిపోయింది. మరోవైపు పాత ధరలతో భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇంకో రోజు సమయం ఉండడంతో శుక్రవారం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతుంది అన్న విషయం తెలుసుకున్న ఎంతోమంది భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తాకిడి పెరగడంతో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మురారిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ అనేక చోట్ల పెద్ద ఎత్తున నిలిచిపోయింది.

కొన్నిచోట్ల ఓపెన్ అవడం ఆ వెంటనే నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ల కోసం భూముల యజమానులు, కొనుగోలుదారులు రావడంతోనే సర్వర్లు మొరాయిస్తున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఎప్పటికీ ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో రిజిస్ట్రేషన్లకు చాలామంది ముందుకు రాలేదు. దీంతో గురువారం నుంచి భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ లకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలులోకి వస్తుండడంతో గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నారు. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ గతంలోనే పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను క్రమబద్ధీకరిస్తున్నామని, కొన్నిచోట్ల ధరలు తగ్గితే మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించామని మంత్రి వివరించారు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్