బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కూడా మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కాకుండా దేశంలోని అనేక చోట్ల నుంచి భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అటువంటి వారంతా ఆలయానికి వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో వర్షాలు నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందుగానే కీలక ప్రకటన విడుదల చేశారు.
తిరుపతిలో కురుస్తున్న వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కూడా మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కాకుండా దేశంలోని అనేక చోట్ల నుంచి భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అటువంటి వారంతా ఆలయానికి వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో వర్షాలు నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందుగానే కీలక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసిన టిటిడి అధికారులు.. శ్రీవారి బ్రేక్ దర్శనానికి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చి ఇబ్బందులు గురికాకుండా ఉండేలా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అక్టోబర్ 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టిటిడి అధికారులు ఒక ప్రకటనలో కోరారు. తిరుపతికి భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఇప్పటికే ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళిక పై టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను అందించారు. వర్షాలు నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు, భక్తులు అవగాహన కలిగి ఉండాలని ఇక్కడికి వచ్చి ఇబ్బందులకు గురికావద్దని ఆయన సూచించారు.
ఇదిలా ఉంటే 48 గంటల్లో తిరుమలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు 2021లో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనతో టిటిడి 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక బాగుందని, మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వాటి ప్రణాళిక మేరకు ప్రస్తుతం విపత్తు నిర్వహణకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. విద్యుత్కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ విద్యుత్ అంతరాయ పరిస్థితిల్లో జనరేటర్ నడపడానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలు పంపిణీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశించారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యశాఖ అంబులెన్స్ లను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండనుంది. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించనుంది. ఘాట్ రోడ్లలో జెసిబి ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచింది. ట్రాఫిక్ పోలీసులు ఇంజనీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్విబిసి, మీడియా, టిటిడి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయనుంది.