కోస్తాకు వర్షం ముప్పు.. నేటి నుంచి 21 వరకు మన జిల్లాల్లో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి బుధవారం నాటికి ఏపీలోని ఉత్తర మధ్య కోస్తా జిల్లాల దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. తరువాత రెండు రోజుల్లో నెమ్మదిగా పయనించి నుంచి ఏపీ కోస్తా తీరంలో బలహీనపడుతుందని పేర్కొన్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి బుధవారం నాటికి ఏపీలోని ఉత్తర మధ్య కోస్తా జిల్లాల దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. తరువాత రెండు రోజుల్లో నెమ్మదిగా పయనించి నుంచి ఏపీ కోస్తా తీరంలో బలహీనపడుతుందని పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసాయి. బుధవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణ, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం, శుక్రవారాల్లో కోస్తాలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ నెల 19న విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఈ నెల 24 శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కోస్తా తీరం దిశగా పయనించే క్రమంలో సముద్రం నుంచి భారీగా తేమ గాలులు రానున్నందున ఈ నెల 21వ తేదీ వరకు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణుడు ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల వరి, పత్తి, పొగాకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉంచిన కుప్పలను సురక్షితంగా సంరక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు సముద్రంలోని వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉత్తర కోస్తా తెలంగాణకు ఆనుకొని ఉన్న కోస్తా జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగింది. బుధవారం చలి తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం  పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మంగళవారం అరకులోయలో 5.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. జి.మాడుగులలో 6.5, జీకే వీధిలో 7.2, హుకుంపేట చింతపల్లిలో 7.4, ముంచంగపుట్టులో 9.7, పెదబయలు 10.3, అనంతగిరిలో 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండడంతో ఏజెన్సీలో పొగ మంచు కురవలేదు. అయినా చలి తీవ్రత తగ్గలేదు. తెలంగాణ, ఏపీలోని అనేక ప్రాంతాల్లో పొగ మంచు తెగ కురుస్తుండడంతో ఉదయం 9 గంటల వరకు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగ మంచు కారణంగా వాహనాలు కనిపించకపోవడంతో కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్