ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. దేశంలోని అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన కొన్నాళ్ల కిందట బీహార్లో సొంతంగా పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక చతికిలా పడిన ఆయన.. మళ్లీ వ్యూహకర్తగా యాక్టివ్ అవుతున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన 2014లో ప్రధానిగా మోదీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అద్భుత విజయం సాధించడంలోనూ తనదైన పాత్ర పోషించారు.
వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. దేశంలోని అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన కొన్నాళ్ల కిందట బీహార్లో సొంతంగా పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక చతికిలా పడిన ఆయన.. మళ్లీ వ్యూహకర్తగా యాక్టివ్ అవుతున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన 2014లో ప్రధానిగా మోదీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అద్భుత విజయం సాధించడంలోనూ తనదైన పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణలోను కొన్ని పార్టీలకు ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే బీహార్లో తన సొంతంగా పార్టీ పెట్టుకోవడంతో వ్యూహకర్త బాధ్యతలనుంచి కొద్దిరోజులపాటు తప్పుకున్న ఆయన మళ్లీ ఆ బాధ్యతలను చేపట్టినట్లు అర్థమవుతుంది. తాజాగా విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవికే) మొదటి ఆవిర్భావ దినోత్సవానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. పీకే ఈ మీటింగ్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల విజయ్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ అంశాలపై చర్చించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. గతంలో అనేక రాజకీయ పార్టీలకు నాయకులకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల్లో సేవలు అందించారు. ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తే అధికారం తత్యం అని అందరూ నమ్మే విధంగా ఆయన వ్యూహాలు ఉంటాయి. తమిళ సినిమా హీరో విజయ్ ను పొలిటికల్ హీరోగా ఈ బీహార్ వ్యూహకర్త మార్చేస్తారా అన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు విజయకు ఎటువంటి సలహాలు ఇస్తారు అన్నదానపై ఆసక్తి నెలకొంది. జనంలోకి దూసుకెళ్లేలా ఎలాంటి పదునైన నినాదాలు రూపొందిస్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. బిజెపికి దగ్గరైన అన్నా డిఎంకెను విజయ్ తనవైపు లాక్కుంటారా.? జయలలిత లేని తమిళనాడులో పీకే ఈ దిశగా పౌలు కలుపుతారా అన్నది తంబీల రాజకీయంలో ఇంట్రెస్టింగ్ గా మారింది. అధికార డిఎంకె మీద శివాలెత్తిపోతున్న విజయ్.. అన్నా డీఎంకేను ఒక్క మాట కూడా అనడం లేదు. దీంతో అన్నాడీఎంకేతో విజయ పార్టీ ఒప్పందం చేసుకుంటుందా అన్న చర్చ కూడా ఇప్పుడు ఊబందుకుంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. డీఎంకేతోపాటు బిజెపిపై కూడా తీవ్రస్థాయిలో విజయ్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరిగే తమిళనాడులో పొలిటికల్ లెక్కలు ఎలా మారుతాయో అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో వ్యూహాలు రచించి తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చేలా చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త బాధ్యతలను చేపట్టడంతో ఆ పార్టీలో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతోంది.