ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితులకు జీవిత ఖైదు.!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఎటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్షను నల్గొండ న్యాయస్థానం విధించింది. ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు నిందితులకు శిక్షణ ఖరారు చేస్తూ సోమవారం కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన అమృత కులాంతర వివాహం చేసుకున్న కోపంతో రగిలిపోయిన తండ్రి మారుతీ రావు కుమార్తె పెళ్లి చేసుకున్న ప్రనయ్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఉగ్రవాది అస్గర్ అలీకి బాధ్యతలను అప్పగించాడు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఎటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్షను నల్గొండ న్యాయస్థానం విధించింది. ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు నిందితులకు శిక్షణ ఖరారు చేస్తూ సోమవారం కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన అమృత కులాంతర వివాహం చేసుకున్న కోపంతో రగిలిపోయిన తండ్రి మారుతీ రావు కుమార్తె పెళ్లి చేసుకున్న ప్రనయ్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఉగ్రవాది అస్గర్ అలీకి బాధ్యతలను అప్పగించాడు. అలీకి సుఫారీ గ్యాంగ్ ద్వారా ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశాడు మారుతీ రావు. ప్రణయ్ ను అంతం చేసేందుకు ఏడుగురు తో గ్యాంగును ఏర్పాటు చేశాడు అలీ. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులు ఈ గ్యాంగ్ లో ఉన్నారు. ఆ గ్యాంగ్ 2018 సెప్టెంబర్ 14న ప్రనయ్ ను హత్య చేసింది.

ఈ కేశవ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. 2019 జూన్ 12న పోలీసులు సాదిషీట్ దాఖలు చేశారు. 1600 పేజీల్లో చార్జ్ షీట్ నివేదికను రూపొందించారు పోలీసులు. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్ ఆధారంగా విచారణ చేపట్టిన నల్గొండ న్యాయస్థానం తీర్పును మార్చి పదికి రిజర్వ్ చేసింది. సుమారు అయిదు నరాలపాటు విచారణ కొనసాగింది. ప్రణయ్ హత్య తరువాత ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీ రావు 2020 మార్చి ఏడో తేదీన ఖైరతాబాద్ వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురి నిందితుల పాత్ర పై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జిషీట్ తోపాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం తుది తీర్పును సోమవారం వెల్లడించింది. నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 8 మంది నిందితుల్లో ఏ-1 గా ఉన్న మారుతీ రావు సూసైడ్ చేసుకున్నారు. ఏ-2 గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితుల్లో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో వేటకుడవలతో ఆయన్ని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిక్ష పడిన నిందితులు పై కోర్టుకు అప్పీల్ కు వెళతారా.? అన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్