దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం పాపులేషన్ సమస్యతో అల్లాడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ గణనీయంగా తగ్గింది. దీనివల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్వ విభజన సందర్భంగా సీట్లను కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనను ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ అధికంగా ఉండడంతో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు ఆయా రాష్ట్రాల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశ జనాభాను నియంత్రణలో ఉంచే ఉద్దేశంతో గడిచిన కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నాయి.
స్టాలిన్, చంద్రబాబు నాయుడు
దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం పాపులేషన్ సమస్యతో అల్లాడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ గణనీయంగా తగ్గింది. దీనివల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్వ విభజన సందర్భంగా సీట్లను కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనను ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ అధికంగా ఉండడంతో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు ఆయా రాష్ట్రాల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశ జనాభాను నియంత్రణలో ఉంచే ఉద్దేశంతో గడిచిన కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో ప్రణాళికలను అమలు చేయకుండా జనాభాను విస్తృతంగా పెంచుకుంటూ వచ్చాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా జనాభాను తగ్గించుకున్నాయని, భవిష్యత్తులో అదే సమస్య కాబోతోంది అంటూ పలువురు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను ఇప్పటికే గుర్తించిన పలువురు ముఖ్యమంత్రి జనాభాను పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ స్వయంగా ముఖ్యమంత్రులే పిలుపునిస్తున్నారు.
కాగా తమిళనాడులో జరిగిన ఒక సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్కువమంది పిల్లల్ని కనాలి అంటూ పిలుపునిచ్చారు. ఇకపై కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే వధూవరులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలను కణాలని ఆయన కోరారు. పునర్విభజనలో తమ రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయన్న ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యేలోగా ఎక్కువ మంది పిల్లలను కనాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. గతంలో పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనవద్దని కాస్త వేచి చూడాలంటూ విజ్ఞప్తి చేసేవారని.. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా ఈ పిల్లల్ని వెంటనే కారణాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఒక్క స్టాలిన్ మాత్రమే కాకుండా గతంలోనూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదేవిధంగా ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఎక్కువమంది పిల్లల్ని కనాలి అంటూ వారు ప్రజలకు సూచించారు. గతంలో ఒకరు లేదా ఇద్దరు అన్న నినాదం ఉండేదని.. ఇప్పుడు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి అంటూ ఈ నేతలంతా పిలుపునిస్తున్నారు. గతంలో ఏపీలో ముగ్గురు పిల్లలు ఉన్నవారికి పోటీ చేసే అర్హత లేకుండా చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే రాష్ట్రంలో జనాభా సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. దీనివల్ల ముగ్గురు పిల్లలను కూడా కనాలి అంటూ ప్రభుత్వం స్వయంగా చెబుతోంది. ఏది ఏమైనా గతంలో జనాభా నియంత్రణపై దృష్టి సారించిన పాలకులు సీట్ల కోసం ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటూ పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతున్న జనాభా ప్రస్తుతం సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా ఈ తరహా ప్రకటనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.