ట్రూడో తరువాత దేశానికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ప్రధాని పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ జాబితాలో భారత సంతతి మహిళ అనిత ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ బాధ్యతలను ఎవరు చేపడుతారు అన్న ప్రశ్న లేవనెత్తినప్పుడు భారత సంతతికి చెందిన మహిళ అనిత ఆనంద పేరు వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె వైపు మెజారిటీ సభ్యులు చూస్తున్నట్లు చెబుతున్నారు.
అనిత ఆనంద్
కెనడాలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో జస్టిన్ ట్రూడే ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రూడో తరువాత దేశానికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ప్రధాని పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ జాబితాలో భారత సంతతి మహిళ అనిత ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ బాధ్యతలను ఎవరు చేపడుతారు అన్న ప్రశ్న లేవనెత్తినప్పుడు భారత సంతతికి చెందిన మహిళ అనిత ఆనంద పేరు వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె వైపు మెజారిటీ సభ్యులు చూస్తున్నట్లు చెబుతున్నారు. మార్చి 24 నాటికి కెనడా కొత్త ప్రధాని ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలను ప్రస్తుతం అనిత ఆనంద్ నిర్వర్తిస్తున్నారు. 2019 నుంచి ఎంపీగా ఉన్న అనిత ఆనంద్.. గడచిన కొన్నాళ్లుగా కెనడా రవాణా, అంతర్గత వాణిజ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతంలో యూనివర్సిటీ ఆఫ్ టోరంటాలో న్యాయశాఖ ప్రొఫెసర్గా వ్యవహరించిన అనిత ఆనంద్.. రాట్మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లోని క్యాపిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ లో పాలసీ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ గా సేవలు అందించారు.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన సమయంలో అనిత ఆనంద్ పనితీరుపై కెనడాలో ప్రశంసలు కూడా వచ్చాయి. ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్, మాస్కులు, పీపీఈ కిట్లు, టీకాలు అందించడంలో అనిత ఆనంద్ ముఖ్యపాత్ర పోషించారు. 1993లో తొలి మహిళా ప్రధానిగా క్యాంపు బెల్ బాధ్యతలను కెనడాకు నిర్వర్తించారు. ఇప్పుడు అన్ని కుదిరితే అనిత ఆనంద్ కెనడాకు ప్రధాని అయ్యే అవకాశం లభించనుంది. 1960 వాదస్కంలో భారత నుంచి కనడాకు వెళ్లి స్థిరపడ్డారు డాక్టర్ సరోజరామ, డాక్టర్ ఎస్ వి ఆనంద్. వీరికి 1967లో అనిత ఆనంద్ జన్మించారు. గ్రామీణ నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన మంత్రి ఆనంద్ 1985లో అంటారియొకు వెళ్లారు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించారు. కెనడాకు చెందిన జాన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అనిత ఆనంద్ అధికార లేబరల్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనిత ఆనంద రాజకీయ నాయకురాలు గానే కాకుండా న్యాయవాదిగా, పరిశోధకురాలిగా పేరుపొందారు. ప్రస్తుతం కెనడాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనిత ఆనంద్ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అందరితోను స్నేహపూర్వకంగా ఉండే అనిత ఆనందుకు మెజారిటీ ఎంపీలు మద్దతు ప్రకటించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లిబరల్ పార్టీ ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.