ఏపీలో డిప్యూటీ సీఎం, సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఒకవైపు టిడిపి నేతలు, మరోవైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టిడిపి నేతలు కోరడం కొత్త చర్చకు దారి తీసింది. మరోవైపు జనసేనకు చెందిన నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్నాళ్లయిన ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తోంది. పాలన సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న దశలో ప్రస్తుతం కూటమిలోని కీలక పార్టీలైన టిడిపి, జనసేన నేతల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన ఏ సభలో పాల్గొన్న అభిమానులు సీఎం.. సీఎం అన్న నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా బరిలోకి దిగే విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కూటమి పార్టీలు.. సీఎంగా చంద్రబాబు నాయుడును ఎన్నుకోగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను నియమించారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న దశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం, సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఒకవైపు టిడిపి నేతలు, మరోవైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టిడిపి నేతలు కోరడం కొత్త చర్చకు దారి తీసింది. మరోవైపు జనసేనకు చెందిన నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్నాళ్లయిన ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టిడిపి క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదని.. అదే సమయంలో తామ పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా బడుగు బలహీన వర్గాల కోరుకుంటున్నాయని పేర్కొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం పదవులు విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో.. అదే కొనసాగిస్తే మంచిదని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దని సూచించారు. వైసీపీకి చెందిన కొంతమంది నేతల జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారని, వాళ్లకు అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. పేర్ని నాని, రోజా జేబుల్లో మైకులు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరగడంపై కిరణ్ రాయల్ స్పందించారు. డ్రోన్ కెమెరాలపై ఐదుగురు అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడు అని అభివర్ణించారు.
ఇదిలా ఉంటే మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ నాయకులనుంచి గట్టిగా వినిపిస్తోంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఇప్పటికే వర్మ డిమాండ్ చేశారు. అంతా దైవేచ్చ అని, లోకేష్ కు ఉందేమో చూద్దామని వ్యాఖ్యానించారు. నుదుటి మీద రాసి పెట్టింది ఎవరో తీయలేరని స్పష్టం చేశారు. టిడిపిలోని కీలక నేతలు కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గళం ఎత్తుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కడప పర్యటన నేపథ్యంలో ఆ జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. యువతకు, తెలుగుదేశం పార్టీకి భరోసా ఇవ్వాలంటే లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని అధినేత చంద్రబాబును శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే మరి కొంతమంది నాయకులు అదే విధంగా మాట్లాడుతున్నారు. టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ సోమిరెడ్డి స్వీట్ కూడా చేశారు. పార్టీలో మూడోతరం నాయకులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో టిడిపి నేతలు.. అది నేత చంద్రబాబుకు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు రెండేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ జనసేన డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది పార్టీల క్యాడర్ మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతోంది. మరి ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో చూడాల్సి ఉంది.