ఏపీలో ఒత్తిడిలో పోలీసులు.. ఇటువైపు ప్రభుత్వం, అటువైపు జగన్ హెచ్చరికలు

ఏపీలో పోలీసులు తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్నాళ్లుగా పోలీసులు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 2014 - 19 మధ్య అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన ఎంతో మందిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ ఒత్తిడితో పరిధికి మించి వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖపరమైన చర్యలను తీసుకుంది. ముఖ్యంగా ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వెంకటేశ్వర్లను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగానే ఇబ్బంది పెట్టింది.

Three police officers have been suspended

సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పోలీస్ అధికారులు

ఏపీలో పోలీసులు తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్నాళ్లుగా పోలీసులు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 2014 - 19 మధ్య అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన ఎంతో మందిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ ఒత్తిడితో పరిధికి మించి వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖపరమైన చర్యలను తీసుకుంది. ముఖ్యంగా ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏపీ వెంకటేశ్వర్లను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగానే ఇబ్బంది పెట్టింది. మరికొందరు అధికారులను కూడా పక్కన పెట్టింది. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత వైసిపి ప్రభుత్వం లో పరిధికి మించి వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలను చేపట్టింది. జత్వాని కేసులో అతిగా వ్యవహరించారంటూ ముగ్గురు పోలీసు అధికారులను పక్కన పెట్టింది. మరి కొన్ని జిల్లాలకు చెందిన పోలీసు అధికారులను ప్రభుత్వం ప్రభుత్వం సరెండర్ చేయడంతో పాటు కొన్నిచోట్ల సస్పెన్షన్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు అంటూ వైసీపీకి చెందిన పలువురిని అరెస్టు చేయిస్తోంది. గడచిన మూడు రోజులుగా బదులు సంఖ్యలో సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. మరింత మందిని అరెస్టు చేయాలంటూ ప్రభుత్వం నుంచి పోలీసులకు ఒత్తిడి ఉంది. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి వారి నుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిబంధనలను అతిక్రమించి మరి కొందరిని అరెస్టు చేస్తున్నారు. దీనిపై వైసిపి తీవ్రస్థాయిలో హెచ్చరికలను జారీ చేసింది. చట్టాన్ని అతిక్రమించి వైసిపి కార్యకర్తలను వేధింపులు గురిచేసే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సప్త సముద్రాలు అవతల ఉన్న తీసుకువచ్చి శిక్షిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికతో ప్రస్తుతం పోలీసుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పెద్దలనుంచి ఇబ్బందులు ఎదురవుతాయని, ఒకవేళ చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో వైసీపీతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసులు మదన పడుతున్నారు. ఈ తరహా పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తెలియడం లేదంటూ పలువురు పోలీసు ఉన్నతాధికారులు వాపోతున్నారు. ముందుకు వెళితే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్న చందంగా తయారయింది తమ పరిస్థితి అంటూ పలువురు పోలీస్ ఉన్న అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెలవులు పెట్టు వెళ్లిపోవడానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ అధికారుల సంగతి తేల్చడంతోపాటు తమ కార్యకర్తలను వేధించే వారిపై ప్రైవేటు కేసులు కూడా పెడతామంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ తరహా కేసులను ఎదుర్కోవడం కూడా పోలీసులకు ఇబ్బందిగా పరిణమిస్తుంది. కాబట్టి వైసీపీ హెచ్చరికలతో కొందరు పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ కొంతమంది పోలీసు అధికారులను గుర్తించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అతిగా వ్యవహరిస్తున్న సదరు పోలీస్ అధికారులపై కేసులు వేసేందుకు అనుగుణంగా ప్రక్రియను వైసీపీ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న ఇబ్బందిగానే ఉంటుందంటూ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని పోలీసులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్