|| ప్రధాని మోదీ, Photo: Twitter ||
ప్రపంచ ప్రజాధారణ పొందిన నాయకులలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ నిర్వహించిన సర్వేలో మన ప్రధానమంత్రి 78 శాతం ప్రజామోదం ఉందని తెలిపింది. ఈ సంస్థ మొత్తం 22 మంది దేశాల నేతలతో సర్వే చేయగా నరేంద్ర మోడీ అత్యధిక ప్రజామోదం కలిగిన నాయకుడిగా నిలిచారు. వరుసగా రెండుసార్లు అత్యంత ప్రజాదారణ పొందిన నాయకుడుగా మన ప్రధానమంత్రి నిలవడం గమనార్హం. కాగా 30 శాతంలో సర్వేలో 13 వ స్థానంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిలిచారు. ఈ సర్వేలో నార్వేప్రధాని జోనాస్ గహర్ 21 శాతంతో చివరి స్థానంలో నిలిచారు.
78 శాతం భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో నిలువగా, 68 శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ రెండో స్థానంలో నిలిచారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఆలైన్ బెర్సెట్ 62 శాతంలో 3వ స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో నిలిచారు. బ్రెజిల్కు అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతంతో 5వ స్థానంలో నిలువగా, ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రి జార్జియామెలోని 52 శాతం ప్రజామోదంతో 6వ స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధినేత జోబైడెన్ 40 శాతంతో 7 వ స్థానంలో నిలిచారు. కెనడాప్రధాని 40 శాతం ఆమోదంతో 9వ స్థానంలోనిలిచారు. యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతంతో 12వ స్థానాన్ని దక్కించుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్ యుల్, జపాన్ప్రధాని ఫుమియో కిషిదా 20,21 స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేలో మొత్తం 22 దేశాల అధినేతలపై జరిపిన ఈ సర్వేలో నార్వేప్రధాని జోనాస్ గహర్ 21 శాతంతో చివరి స్థానంలో నిలవడం జరిగింది.