ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024 డిసెంబర్ వరకు ఫైలను పరిష్కరించడంలో మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుకు సంబంధించిన ర్యాంకులను ఆయన వివరించారు. పనితీరులో అత్యుత్తమంగా ఉన్న వారిని అభినందించిన ఆయన.. వెనుకబడిన వారు ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. 25 మంది మంత్రుల జాబితాను, ర్యాంకులను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. వెనుకబడిన వారు మెరుగ్గా పనిచేసేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024 డిసెంబర్ వరకు ఫైలను పరిష్కరించడంలో మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుకు సంబంధించిన ర్యాంకులను ఆయన వివరించారు. పనితీరులో అత్యుత్తమంగా ఉన్న వారిని అభినందించిన ఆయన.. వెనుకబడిన వారు ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. 25 మంది మంత్రుల జాబితాను, ర్యాంకులను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. వెనుకబడిన వారు మెరుగ్గా పనిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. అయితే ఈ ర్యాంకుల విడుదల ఇప్పుడు కూటమిలో చిచ్చుకు కారణమవుతోంది. ఎందుకంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదోవ స్థానంలో ఈ జాబితాలో ఉండడమే కారణంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి గానే కాకుండా తన పరిధిలోని శాఖలను అత్యద్భుతంగా నిర్వర్తిస్తున్నారని జన సైనికులు భావిస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ కు ఈ జాబితాలో పదో స్థానాన్ని కేటాయించడం పట్ల జనసైనికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అందులోనూ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ వెనుకబడడం పట్ల వారంతా మరింత రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాలు వేదికగా జనసైనికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో అనేక పనులను పవన్ కళ్యాణ్ చేపట్టారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్ల పనులు జరుగుతుంటే ఈ శాఖలో జరిగిన అభివృద్ధిని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించకపోవడం దారుణమని, ఇంతకంటే పవన్ కళ్యాణ్ పనితీరుకు నిదర్శనం మరొకటి ఏమి కావాలని ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడికి మంచి ర్యాంకు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తక్కువ చేసే ప్రయత్నం చేయడం సమంజసం కాదని సామాజిక మాధ్యమాల వేదికగా వారంతా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది జాబితా..
మంత్రులు పనితీరు ఆధారంగా, తమ వద్దకు వచ్చిన ఫైల్ ను క్లియర్ చేసిన దానిని బట్టి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులను కేటాయించారు. ఆరు నెలల్లో సగటున రెండు పాయింట్ 30 గంటలకు ఒక ఫైల్ చొప్పున క్లియర్ చేసిన మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మొదటి స్థానంలో ఈ జాబితాలో నిలిచారు. రెండో స్థానంలో కందులు దుర్గేష్ ఉండగా, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదో స్థానంలో డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆరో స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఏడో స్థానంలో సత్య కుమార్ యాదవ్, ఎనిమిదో స్థానంలో నారా లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, పదో స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ తర్వాత ఎస్ సవిత, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, పి నారాయణ, టీజీ భరత్ తదితరులు వరసగా ర్యాంకుల్లో ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్ నిలిచారు.