కేటీఆర్ పై కేసును చెత్త కేసుగా అభివర్ణించిన పాల్.. ఢిల్లీకి కప్పం పంపిస్తున్నారంటూ ఆరోపణలు

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేయడంపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నో రాజకీయ ప్రేరేపిత కేసుగా ఆయన అభివర్ణించారు. తన జీవితంలో చూసిన అత్యంత చెత్త కేసుగా దీనిని కేఏ పాల్ అభివర్ణించారు. కేటీఆర్ పైన పెట్టిన కేసును దేశంలోనే అత్యంత చెత్త కేసుగా ఆయన పేర్కొన్నారు.

KA Paul

కేఏ పాల్ 

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేయడంపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నో రాజకీయ ప్రేరేపిత కేసుగా ఆయన అభివర్ణించారు. తన జీవితంలో చూసిన అత్యంత చెత్త కేసుగా దీనిని కేఏ పాల్ అభివర్ణించారు. కేటీఆర్ పైన పెట్టిన కేసును దేశంలోనే అత్యంత చెత్త కేసుగా ఆయన పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై పెట్టిన కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. అటువంటి అంశంలో కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఏసీబీ కేసు నమోదు చేయగానే వీడి నోటీసులు ఇచ్చిందని, దీనిని బట్టి అసలు ఉద్దేశం ఏంటో అర్థం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా ఇబ్బందులు రాజకీయ నాయకులకు తప్పని స్పష్టం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను భేషరతుగా అమలు చేయాలని ఈ సందర్భంగా కేఏపాల్ డిమాండ్ చేశారు. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఉండి తాము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి లక్ష కోట్ల వరకు అప్పుడు చేశాడని, మరో లక్ష కోట్లు అప్పులు చేస్తాడని స్పష్టం చేశారు. చేసిన అప్పుల్లో కొంతవరకు మంత్రులు దోచుకున్నారని, మిగిలిన మొత్తాన్ని ఢిల్లీకి కప్పం కట్టారని కేఏ పాల్ ఆరోపించారు. భవిష్యత్ లోను మరిన్ని అప్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయినప్పటికీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రజాశాంతి పార్టీ సిద్దంగా ఉందన్నారు. త్వరలోనే రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసిన నష్టాన్ని, మోసాన్ని ఇంటింటికి తీసుకువెళ్లి వివరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్లని, ఇతర పార్టీల నాయకులు వచ్చి నగదు, బహుమతులు ఇస్తే వారి వద్ద తీసుకొని తనకు ఓటేయాలని కేఏ పాల్ కోరారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఓటు వేస్తే తెలంగాణకు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీగా ఆయన అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవి ఊడిపోయే ముక్కు లాంటిదని ఎద్దేవా చేశారు. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం తనంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డిని ఐదుసార్లు కలిసానని, ఆప్యాయంగా మాట్లాడారని పేర్కొన్నారు. కానీ తాను ప్రభుత్వ విధానాలను మాత్రం విమర్శిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేస్తే ఆ విషయాన్ని ప్రజలకు చెబుతానని, కీడు చేసే విషయాల పైన విమర్శలు చేస్తానని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యవస్థను చంద్రబాబు నాయుడు పాడు చేసేందుకే తీసుకువచ్చాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వల్ల వర్గీకరణ కోసం మాలలు, మాదిగలు కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కేఏ పాల్ విమర్శించారు. తెలంగాణలో ఇకపై యాక్టివ్ గా రాజకీయాలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్