రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన.. విమాన సర్వీసు రద్దుతో నిరసన

తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 45 మంది ప్రయాణికులు నిరసనను తెలియజేశారు. ఎయిర్ లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ఈ ప్రయాణికులంతా ఆందోళన చేపట్టినట్లు తెలిసింది.

Concerned passengers

ఆందోళన చేస్తున్న ప్రయాణికులు

తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 45 మంది ప్రయాణికులు నిరసనను తెలియజేశారు. ఎయిర్ లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ఈ ప్రయాణికులంతా ఆందోళన చేపట్టినట్లు తెలిసింది. హైదరాబాదు నుంచి ఉదయం 7:15 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు విమానం వచ్చింది. తిరిగి ఉదయం 8:15 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాదు వెళ్లాల్సిన విమాన సర్వీసును రద్దు చేశారు.  ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ రద్దు చేయడంతో ఆఫ్లైట్లో వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వకుండా రద్దు ఎలా చేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వేచి ఉండడంతో అసహనంతో ప్రయాణికులు అక్కడే బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎయిర్లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు.

ఈ తరహా చర్యల వల్ల విమాన ప్రయాణికులు విలువైన సమయం వృధా కావడంతోపాటు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. తనకు అత్యవసర మీటింగ్ ఉందని, అకస్మాత్తుగా విమానం రద్దయిందని వెల్లడించారని ఇప్పుడు తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదంటూ ఒక ప్రయాణికుడు వాపోయాడు. తనలాంటి ఎంతోమంది ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సమయాన్ని వృధా చేయడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించిన ఎయిర్ లైన్స్ పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు పేర్కొన్నారు. దీనిపై విమానయాల శాఖకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ఎయిర్ లైన్స్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. విమాన ప్రయాణికులు అంటే కనీస గౌరవం లేకుండా పోయిందంటూ పలువురు పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణించే వారికి కూడా రద్దయిన విషయాన్ని ముందే చెబుతారని, కానీ ఎయిర్ లైన్స్ సిబ్బంది అంతకంటే దారుణంగా వ్యవహరించి సమాచారాన్ని ఇవ్వలేదని పలువురు విమర్శలు గుప్పించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్