నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడిగా జరిగే అవకాశం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిళ్ళలను ఆమోదించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. మరోవైపు విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభించేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బడ్జెట్ స్టేషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమై ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చేర్చుకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలు దేశంలోని వివిధ సమస్యలపై గళం ఎత్తే అవకాశం ఉంది.

Budget Sessions

పార్లమెంట్ సమావేశాలు 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిళ్ళలను ఆమోదించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. మరోవైపు విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభించేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బడ్జెట్ స్టేషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమై ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చేర్చుకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలు దేశంలోని వివిధ సమస్యలపై గళం ఎత్తే అవకాశం ఉంది. వీటిలో మణుపూర్లో జరుగుతున్న హింసకాండ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల బెదిరింపు, పార్లమెంటరీ నియోజకవర్గం పై పార్లమెంట్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవైపు బడ్జెట్కు పార్లమెంటు ఆమోదముద్రవేయడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్ కు, వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వాటర్ల జాబితాలో అక్రమాల ఆరోపణలు, మణిపూర్లో అక్రమాల ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో నకిలీ వాటర్ కార్డుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

ఉభయ సభలో ఈ సమస్యను లేవనెత్తడానికి కాంగ్రెస్, డీఎంకే, వద్దు వర్గం శివసేన సహా ఇతర ప్రతిపక్షాల మద్దతును తృణమూల్ కోరింది. అయితే దీనిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికీ దీనిపై పార్లమెంటు వేదిక ఆందోళనను చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇతర పార్టీల మద్దతును కూడా తృణముల్ సంపాదిస్తోంది. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూడా విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సంబంధించిన స్పష్టమైన సమాధానాలను ఇవ్వాలని నిర్ణయించుకుంది. సంబంధించి ఒక్కో అంశంపై ఒక్కో మంత్రి మాట్లాడేలా వారికి కీలక బాధ్యతలను అప్పగించారు. అవసరమైతే ముఖ్యమైన అంశాలపై ప్రధాన నరేంద్ర మోడీ స్పందించనున్నారు. కొన్ని అంశాల కోసం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెబుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా బడ్జెట్ రెండో దశ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్