హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ మహా కుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 26 తో మహా కుంభమేళా ముగియనుంది. మహా కుంభమేళ ముగిసే రోజు మరో అద్భుతమైన ఘట్టానికి నాంది కాబోతోంది. మహా కుంభమేళ ముగిసే రోజు ఖగోళ ఘట్టం తోడవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. సూర్యుడు చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్ ఏడు గ్రహాలు ఒకే సరళరేఖపై రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ మహా కుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 26 తో మహా కుంభమేళా ముగియనుంది. మహా కుంభమేళ ముగిసే రోజు మరో అద్భుతమైన ఘట్టానికి నాంది కాబోతోంది. మహా కుంభమేళ ముగిసే రోజు ఖగోళ ఘట్టం తోడవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. సూర్యుడు చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్ ఏడు గ్రహాలు ఒకే సరళరేఖపై రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో భారతదేశ నుంచి చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాల కలయిక మహా కుంభమేళాకు మరో విశిష్టతను తీసుకువచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. ఖగోళ విశేషాలు, ఆధ్యాత్మిక శక్తుల మధ్య సంబంధం ఉందని నమ్మేవారికి ఇది మరింత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా మారింది. ఈ గ్రహాల పరేడ్ 2025 జనవరిలో మొదట శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ కనిపించడం మొదలైంది. ఇక చివరిగా బుధుడు కూడా ఈ సమూహానికి చేరి ఫిబ్రవరి 28న ఈ గ్రహ సముదాయం కనువిందు చేయనుంది. ఈ గ్రహాలు సూర్యుని మార్గాన్ని సూచించే ఎక్లిప్టిక్ వెంట ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే రేఖపై ఉండడంతో అద్భుతమైన గ్రహ పరేడ్ ను చూడవచ్చు. ఇక వీటిలో ఐదు గ్రహాలు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శనీలను అత్యంత స్పష్టంగా కంటి చూపుతోనే చూడవచ్చు. అయితే యురేనస్, నెప్ట్యూన్లను మసక బారిన గ్రహాలుగా ఉండటం వల్ల చూడటానికి బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ వినియోగించాల్సి ఉంటుంది. మహా కుంభమేళా ముగిసే సమయంలో ఇది జరుగుతుండడం విశేషంగా మారింది. భక్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ అద్భుతమైన గ్రహ సమూహాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.