ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిలిపివేత

ఏపీలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపి వేసేందుకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా ఉచితంగా అందించిన వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను పెండింగ్లో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు సంబంధించి సుమారు మూడువేల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ మతాలను చెల్లించకపోవడంతో వైద్య సేవలను నిలిపేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ యాజమాన్యం నిర్ణయించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపి వేసేందుకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా ఉచితంగా అందించిన వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను పెండింగ్లో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు సంబంధించి సుమారు మూడువేల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ మతాలను చెల్లించకపోవడంతో వైద్య సేవలను నిలిపేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ యాజమాన్యం నిర్ణయించింది. తక్షణమే రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లేఖ రాసింది. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించడమే దుస్థితిలో ఉన్నామంటూ అసోసియేషన్ వాపోతోంది.

ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందని, ఈ నేపథ్యంలోనే సమ్మెకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. తక్షణమే 2000 కోట్ల రూపాయలను చెల్లించడంతోపాటు మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాల పరిమితులోపు చెల్లిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం దీనిపై ఎటువంటి స్పందనను ఇప్పటి వరకు తెలియజేయలేదు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు కొన్ని వేలమంది ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు. ఆస్పత్రులు సమ్మెలోకి వెళితే మాత్రం వీరంతా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆసుపత్రిలో యాజమాన్యాలతో చర్చించాలని రోగులు కోరుతున్నారు. లేకపోతే వేలకు వేల రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్