తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ సభ ఈ నెల 14న విజయవాడలో నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెల 24వ తేదీ నాటికి ఎన్టీఆర్ తొలి సినిమా మన దేశం విడుదలై 75 వేలు పూర్తయ్యాయి.
నందమూరి తారక రామారావు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ సభ ఈ నెల 14న విజయవాడలో నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెల 24వ తేదీ నాటికి ఎన్టీఆర్ తొలి సినిమా మన దేశం విడుదలై 75 వేలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ జగత్తులోనే కాకుండా భారతీయ సినీ రంగంలో ఎన్టీఆర్ ఒక మేరునగ ధీరుడుగా పేరుగాంచారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక.. ఇలా పాత్ర ఏదైనా ఆయన నటించి మెప్పించారు. ప్రతి నాయకుడు పాత్రను కూడా అద్భుతంగా చేసిన ఆయన శని రంగంలో తనకంటూ ఒక బ్రాండ్ ను సృష్టించుకున్నారు. సినీ రంగంలో నటుడిగా తనను ఎంతగానో ఆదరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయంలోకి వచ్చిన ఆయన పేదవాడి మనసు తెలిసి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారు. 40 ఏళ్ల క్రితం నదుల అనుసంధానం గురించి ఆలోచించిన ఆయన రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల అవసరాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు.
వజ్రోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు పురందేశ్వరి, రామకృష్ణ, బాలకృష్ణతోపాటు అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, రామానాయుడు కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సదస్సులో భాగంగా సినీ రంగంలో ఎన్టీఆర్ తోపాటు కలిసి పని చేసిన కళాకారులు టెక్నీషియన్లు దర్శకులను ఆహ్వానించనున్నారు. ఈ నెల 14న విజయవాడ శివారులోని పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ రిసార్ట్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ సినీ విశేషాలతో ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తే రెండున్నర నెలల్లో 1.26 కోట్ల మంది చూశారని, 27 వేల మంది సబ్స్క్రయిబ్ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దేశం నుంచి మొదలుకొని ఎన్టీఆర్ నటించిన 300 సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారంతో తారకరామం పేరుతో ఒక పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకలో విడుదల చేస్తున్నామని ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ రావు వెల్లడించారు. తెలుగు నాట ఎన్టీఆర్ స్మృతి శిరస్థాయిగా ఉండడానికి హైదరాబాదులో ఆయన 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ ఆయనకు సంబంధించిన విశేషాలతో డిజిటల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని జనార్ధన్ తెలిపారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.