ఈ నెల 31న కేరళకు నైరుతి రుతుపవనాలు.. భారత వాతావరణ శాఖ అంచనా

Southwest Monsoon : దేశంలోని ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు మే 31వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.

monsoon rains
ప్రతీకాత్మక చిత్రం

ఎప్పుడూ లేనంత స్థాయిలో ఎండలు మండిపోయాయి. ఎప్పుడు వాన చినుకులు పలకరిస్తాయా అని ఎదురుచూస్తున్నాం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు మే 31వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఏడాది రుతు పవనాల రాక సాధారణ సమయానికే.. అంటే జూన్ 1 నాటికి కేరళను తాకుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. జూన్‌-సెప్టెంబర్‌ మధ్య సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

గత ఏడాది వర్షాలు సరిగా పడకపోవడంతో దేశంలోని రైతాంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక తదితర రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి భారీ వర్షాలు కురిస్తే రైతాంగానికి గొప్ప శుభవార్త కానుంది. అదీకాక.. భూగర్భ జల వనరులు పెరిగి, వచ్చే వేసవికి తాగు నీటి సమస్య తీరే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్