ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నారు. పీఎం కిసాన్ 18వ విడుత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు.
ఈవార్తలు, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నారు. పీఎం కిసాన్ 18వ విడుత నిధులను అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు రైతులకు సహాయం చేస్తుంది. 2018 డిసెంబర్ కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభం చేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారుల ఖాతాలకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మూడు వాయిదాలలో డబ్బు ఇస్తున్నారు. పీఎం కిసాన్ 16వ విడతలో 9.3 కోట్ల మంది రైతులు రూ. 2 వేలు పొందారు.
ఈ-కేవైసీ పూర్తి చేయండిలా..
* 18వ విడత డబ్బులు అందాలంటే రైతులు కేవైసీ పూర్తి చేయాలి.
* అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in కి వెళ్లాలి.
* హోమ్పేజీలో ఫార్మర్ కార్నర్.. విభాగంలోని ఈ-కేవైసీపై క్లిక్ చేయాలి.
* అవసరమైన ఫీల్డ్లో 12 అంకెల ఆధార్ నంబర్ను టైప్ చేయాలి.
* సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి.
* ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేయాలి.
* ఈ-కేవైసీపీ ప్రక్రియను పూర్తి చేయటానికి సబ్మిట్ బటన్ నొక్కాలి.
* రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో కూడా ఈకేవైసీ పూర్తి చేయచ్చు.
స్టేట్మెంట్ ఎలా చూడాలి..
* పీఎం కిసాన్ వబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగంలోకి వెళ్లాలి.
* బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* రిజిస్టర్ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ను ఎంటర్ చేయాలి.
* ‘గెట్ డేటా’ బటన్పై క్లిక్ చేయాలి.
ఈ-కేవైసీ తప్పనిసరి..
రైతుల బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న రైతులకు.. ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ... పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలకు వెళ్లాలి. పీఎం కిసాన్ పథకంలో మధ్యవర్తుల ప్రమయం లేకుండా చేయడానికి ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు.