LIC BIMA SAKHI | మహిళలకు నెలకు 7 వేల ఆదాయం .. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఎల్​ఐసీ బీమా సఖీ యోజన - నెలకు రూ.7 వేలు - LIC బీమా సఖీ: దేశంలోని మహిళల కోసం మోడీ సర్కారు కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ- ఎల్​ఐసీ మంచి అవకాశం.

lic bima sakhi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ, ఈవార్తలు: దేశంలోని మహిళల కోసం మోడీ సర్కారు కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ- ఎల్​ఐసీ మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా పదో తరగతి చదివిన మహిళలు కూడా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఆ పథకం పేరే 'బీమా సఖి యోజన'. ఈ స్కీమ్​ను ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలోని పానీపత్​లో సోమవారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎల్ఐసీ 'బీమా సఖి యోజన' ద్వారా ఉద్యోగం పొందడానికి గల విద్యార్హత, వయోపరిమితి, సాలరీ తదితర వివరాలు తెలుసుకుందాం.

విద్యార్హత: ఎల్​ఐసీ 'బీమా సఖి యోజన' ద్వారా రాబోయే మూడేళ్లలో 2 లక్షల మంది మహిళా బీమా ఏజెంట్లను నియమించాలన్నది ప్రణాళిక. ఈ పథకానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి:  18-70 ఏళ్ల వయసు గల మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి ఈ స్కీమ్​ను ఎల్​ఐసీ తీసుకొచ్చింది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం.

మూడేళ్లు శిక్షణ, స్టైపెండ్:  బీమా సఖులుగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడం సహా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బీమా సఖీలకు మొదటి మూడేళ్లు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో నెలవారీ స్టైపెండ్​ను కూడా ఇస్తారు.

వేతనం:  మొదటి ఏడాది నెలకు రూ.7,000, రెండో ఏట నెలకు రూ.6,000, మూడో ఏడాది నెలకు రూ.5,000 పొందొచ్చు. అలాగే బీమా శాఖలు కూడా వారికి బెనిఫిట్స్ అందిస్తాయి. ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. మూడేళ్ల శిక్షణ తర్వాత బీమా సఖులు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేయవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్ స్థాయి బీమా సఖీలు ఎల్‌ఐసీలో డెవలప్​మెంట్ ఆఫీసర్​గా కూడా అవకాశం పొందుతారు. హరియాణాలోని పానీపత్​లో 'బీమా సఖి యోజన' ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. హరియాణాలో డబుల్ ఇంజిన్ సర్కార్ రెట్టింపు వేగంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. బీమా సఖి యోజన అందరికీ బీమా లక్ష్యాన్ని చేరుకోవడానికి సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 1.15 కోట్ల మంది మహిళలు లఖ్ పతి దీదీలు అయ్యారని, ఆ సంఖ్య 3 కోట్లకు చేరుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్