మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను.. గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించటంతో ఢల్లీిలోని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారని దవాఖాన వర్గాలు వెల్లడించాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం
- పరిస్థితి విషమించి నిన్న రాత్రి మృతి
- సంతాపం ప్రకటించిన దేశాధినేతలు
న్యూఢిల్లీ, ఈవార్తలు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను.. గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించటంతో ఢల్లీిలోని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన నేతల్లో ఒకరు. ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ, దేశాన్ని గ్లోబల్ మార్కెట్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 2014 వరకూ, రెండు పదవీ కాలాల్లో భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని (ఇప్పటి పాకిస్తాన్) గాప్ా గ్రామంలో పుట్టిన మన్మోహన్.. ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా పని చేశారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రస్తుత రాజకీయ నేతలు, ప్రపంచ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. అటు.. మన్మోహన్ మృతి వార్త తెలియగానే బెళగావి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ ఢల్లీికి బయలుదేరి వెళ్లారు.