ఎమ్మెల్సీ స్థానానికి నేడు నాగబాబు నామినేషన్ దాఖలు.. చివరి వరకు సస్పెన్స్

ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఎట్టకేలకు ఖరారు చేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తీవ్ర చర్చ జరిగింది. మొదట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును తీసుకొని అనంతరం మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అందుకు అంగీకరించారని అంతా చెప్పారు. అయితే అనూహ్యంగా నాగబాబు శాసనమండలికి కాకుండా రాజ్యసభకు వెళ్తారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయిన స్థానాన్ని కేటాయించేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ఈ స్థానాన్ని బిజెపి కోరుతుండడంతో కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమైనట్లు తెలిసింది.

nagababu

 నాగబాబు

ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఎట్టకేలకు ఖరారు చేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తీవ్ర చర్చ జరిగింది. మొదట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును తీసుకొని అనంతరం మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అందుకు అంగీకరించారని అంతా చెప్పారు. అయితే అనూహ్యంగా నాగబాబు శాసనమండలికి కాకుండా రాజ్యసభకు వెళ్తారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ద్వారా ఖాళీ అయిన స్థానాన్ని కేటాయించేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. అయితే ఈ స్థానాన్ని బిజెపి కోరుతుండడంతో కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమైనట్లు తెలిసింది. అందుకే అనూహ్యంగా మళ్లీ ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబుకు కేటాయించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం ద్వారా ఆయనకు మంత్రి పదవిని ఖరారు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. బిజెపికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధపడినప్పటికీ.. బిజెపి అగ్ర నాయకత్వం మాత్రం రాజ్యసభ సీటు కోసం పట్టుబట్టినట్లు చెబుతున్నారు. బిజెపి అగ్ర నాయకుల ఆదేశాలతోనే ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబుకు కేటాయించినట్లు చెబుతున్నారు. దీనిపై బిజెపి అగ్ర నాయకులు పవన్ కళ్యాణ్ కూడా సూచనలు చేయడంతో ఆయన కూడా కాదనలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబు పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేశారు. ముందు నుంచి అనుకున్నట్టుగా నాగబాబు ఎమ్మెల్సీ గా బాధ్యతలు స్వీకరించి అనంతరం మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలినుంచి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్న నాగబాబు గడిచిన ఎన్నికల్లో అనివార్య కారణాలవల్ల పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తన సోదరుడు నాగబాబుకు ఎలాగోలా పదవి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ మేరకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకు కేటాయించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రిగాను చేయించడం ద్వారా ఆయన రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించాలన్న కోరిక నెరవేరినట్టు అయింది. 

మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు కావడంతో నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ పత్రాలుపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యుదయత్వాన్ని ప్రతిపాదిస్తూ పదిమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వీరిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరని శ్రీనివాసు తదితరులు సంతకాలు చేశారు. నాగబాబు నామినేషన్ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఆయన నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనేక ట్విస్టులు నెలకొన్నాయి. మొదటి ఎమ్మెల్సీగా ఎన్నిక అయి మంత్రి పదవి చేపడతారని, ఆ తరువాత రాజ్యసభకు వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడంతో ట్విస్టులకు తెరపడినట్టు అయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్