ప్రపంచంలోని కుబేరులు సంపద మరింత పెరగనుంది. అనేక దేశాల్లో ఉన్న కుబేరులు ఆదాయం రానున్న రోజుల్లో గణనీయంగా పెరగనుంది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్ ఎక్స్ ల అధినేత ఎలాన్ మస్క్ సంపద 2027 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. ఇదే జరిగితే ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీరుగా (లక్ష కోట్ల డాలర్లు) మస్క్ రికార్డు సృష్టించనున్నారు.
ఎలాన్ మస్క్
ప్రపంచంలోని కుబేరుల సంపద మరింత పెరగనుంది. అనేక దేశాల్లో ఉన్న కుబేరులు ఆదాయం రానున్న రోజుల్లో గణనీయంగా పెరగనుంది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్ ఎక్స్ ల అధినేత ఎలాన్ మస్క్ సంపద 2027 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. ఇదే జరిగితే ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీరుగా (లక్ష కోట్ల డాలర్లు) మస్క్ రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుత డాలర్ రూపాయి మారకం రేటు ప్రకారం ఆయన సంపద విలువ రూ.83.96 లక్షల కోట్లకు సమానం. ఇందుకోసం మస్క్ సంపద 2027 వరకు ఏటా సగటున 110 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఒక నివేదికలో తెలిపింది. మస్క్ ఇప్పటికే 23,700 కోట్ల డాలర్లు (సుమారు రూ.19.89 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ లో ఎలాన్ మస్క్ కొనసాగుతుండగా.. భారత్ నుంచి కూడా పలువురు ఈ జాబితాలో పోటీపడుతున్నారు. భారత్ కు చెందిన పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, ముఖేష్ అంబానీ కూడా ఈ స్థాయికి చేరుకునేందుకు పోటీపడుతున్నారు. గౌతమ్ ఆదానీ 2028 నాటికి, ముఖేష్ అంబానీ 2033 నాటికి ఈ స్థాయికి చేరే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ఇందుకోసం అదా అని సంపద ఆట ప్రస్తుతం వృద్ధి రేటు 123 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం పదివేల కోట్ల డాలర్లు (సుమారు రూ.8.89 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచ కుబేరులు జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ 11000 కోట్ల డాలర్ల (సుమారు 9.32 లక్షల కోట్లు) సంపదతో ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. 2035 నాటికి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరి ఆ స్థాయికి చేరిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించనిందని ఈ సంస్థ వెల్లడించింది.
కుబేరులు జాబితాలో పోటీ..
ఎలాన్ మస్క్, గౌతమ్ అదాని, ముఖేష్ అంబానీలతోపాటు మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వెనుక ముందు తెలియని జాబితాలో చేరే అవకాశం ఉందని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ తెలిపింది. అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా అధినేత జెన్షెన్ హువాంగ్, ఇండోనేషియా పారిశ్రామికవేత్త ప్రజోగో పంగేస్తు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్ బర్గ్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని సదరు సంస్థ వెల్లడించింది.