దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు కలిగిన నగరాల జాబితాలో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో దక్షిణాదికి చెందిన హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ మహానగరం నిలిచింది. హైదరాబాద్ నగరంలో 18 మంది బిలియనీర్లు (వందల కోట్ల డాలర్లు అంటే రూ.8,388 కోట్ల నికర సంపద ఉన్నవారు), 14 మంది సంపన్నులు (వేయి కోట్ల నికర సంపద ఉన్నవారు) ఉన్నారని తాజాగా విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్టు - 2024 వెల్లడించింది.
హైదరాబాదు నగరం
దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు కలిగిన నగరాల జాబితాలో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో దక్షిణాదికి చెందిన హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ మహానగరం నిలిచింది. హైదరాబాద్ నగరంలో 18 మంది బిలియనీర్లు (వందల కోట్ల డాలర్లు అంటే రూ.8,388 కోట్ల నికర సంపద ఉన్నవారు), 14 మంది సంపన్నులు (వేయి కోట్ల నికర సంపద ఉన్నవారు) ఉన్నారని తాజాగా విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్టు - 2024 వెల్లడించింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న బెంగుళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. హురున్ భారత సంపన్నుల జాబితాలో ఈసారి మొత్తం 1539 మంది స్థానం సంపాదించుకున్నారు. వీరిలో 334 మంది బిలయనీర్లు ఉన్నారు. గడిచిన ఏడాది జాబితాతో పోలిస్తే ఈసారి 20020 మంది అదనంగా చేరారు. గత ఏడాదితో చూస్తే సంపన్నుల మొత్తం సంపద ఈసారి 46 శాతం మేర పెరిగింది. దేశంలోని నగరాల పరంగా చూస్తే 386 మంది సంపన్నులతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. వీరిలో 92 మంది బిలియనీర్లు ఉన్నారు. 217 మంది సంపన్నులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. వీరులో 68 మంది బిలియనీర్లు ఉన్నారు. గడిచిన ఏడాది మూడో స్థానంలో ఉన్న బెంగుళూరును అధిగమించి తొలిసారి ఆస్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. హైదరాబాదులో ఉన్న సంపన్నుల సంఖ్య 104 మంది. వీరిలో 18 మంది బిలియనీర్లు ఉన్నారు. గడిచిన ఏడాదితో పోలిస్తే 17 మంది ఎక్కువ. ఆ తర్వాతి స్థానాల్లో బెంగుళూరు (100), చెన్నై (82), కోల్ కతా (69), అహ్మదాబాద్ (67), పూణే (53), సూరత్ (28), గురుగ్రామ్ (23) ఉన్నాయి. రిచ్ లిస్ట్ పై హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ప్రధాన పరిశోధకుడు ఆనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ ఆసియాలోనే సంపదను సృష్టించే ఇంజిన్ గా భారత్ ఆవిర్భవిస్తుందన్నారు. భారత్ లో తెలియనిర్ల సంఖ్య 29 శాతం పెరగగా చైనాలో 25 శాతం తగ్గుదల నమోదయిందన్నారు.
హైదరాబాదులోని టాప్ బిలియనీర్లు వీళ్లే..
హైదరాబాదులోని బిలియనీర్లు జాబితాలో మురళి దివి కుటుంబం టాప్ లో ఉంది. రూ.76,100 కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో మురళి దివి కుటుంబం కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో పి పిచ్చిరెడ్డి (రూ.54,800 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ.52,700 కోట్లు), బి పార్థసారధి రెడ్డి (రూ.29,900 కోట్లు) కొనసాగుతున్నారు. దేశ వ్యాప్తంగా బిలియనీర్ల పరంగా చూస్తే గౌతమ్ అదానీ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో సంపద 57 శాతం ఆవిరి అయిపోయి 4.74 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో 8.8 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ హిరున్ రిచ్ లిస్టు 2023లో అగ్రస్థానంలో నిలిచారు. అయితే అదానీ తర్వాత తిరిగి పుంజుకున్నారు. రూ.11.60 లక్షల కోట్ల నికర సంపదతో ఈ ఏడాది భారత్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగింది. ఆదాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ రూ.10.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగింది. అదాని, అంబానీ తర్వాత మూడో స్థానంలో రూ.3.14 లక్షల కోట్ల నికర సంపదతో హెచ్సిఎల్ కంపెనీ యజమాని శివ నాడార్ నిలిచారు. రూ.2.89 లక్షల కోట్లతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని సైరస్ పూనావాలా నాలుగో స్థానాన్ని, రూ.2.5 లక్షల కోట్లతో సన్ ఫార్మా స్యూటికల్స్ దిలీప్ శాంగ్వి ఐదవ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. మహిళలు పరంగా చూస్తే రూ.47,500 కోట్ల నికర సంపదతో జోహో కంపెనీ యజమానురాలు రాధా వెంబూ తొలి స్థానంలో ఉన్నారు. సంపన్నుల పరంగా చైనా రాజధాని బీజింగ్ ను ముంబై దాటిపోయిందని ఈ ఏడాది మార్చిలోనే హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు వెల్లడించింది. బిలియనీర్ల సగటు సంపద చైనాలో రూ.26,840 కోట్లు కాగా, భారత్ లో అది రూ.31,873 కోట్లు అని ఈ జాబితా తెలిపింది. బీజింగ్ లో 91 మంది బిలియనీర్ల ఉండగా ముంబైలో 92 మంది ఉన్నారని, తద్వారా దక్షిణాసియా బిలియనీర్ల రాజధానిగా ముంబై రికార్డు నెలకొల్పిందని పేర్కొంది.