ఏపీలో గడచిన సార్వత్రికి ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో సూపర్ సిక్స్ పేరుతో ఫలు హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ప్రజలు సామాజిక మాధ్యమాలుగా విమర్శలు చేస్తుంటే మరోవైపు వైసీపీ కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకు వెళ్తోంది.
టిడిపి ఇచ్చిన హామీల లోగో
ఏపీలో గడచిన సార్వత్రికి ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో సూపర్ సిక్స్ పేరుతో ఫలు హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ప్రజలు సామాజిక మాధ్యమాలుగా విమర్శలు చేస్తుంటే మరోవైపు వైసీపీ కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకు వెళ్తోంది. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని భావిస్తున్న కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీల్లో కొన్ని అయినా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ హామీలు అమలకు ఒక తేదీని కూడా ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. జూన్లోగా మూడు కీలక హామీలను అమలకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. వీటిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా వెల్లడించారు.
ఈ మేరకు పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి చర్యలను చేపట్టేలా అధికారులకు ఆదేశాలను జారీ చేయనున్నారు. ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొద్దిరోజుల్లోనే వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసేందుకు సిద్ధమవుతుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. వీటితోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో ఉండేలా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.