బొల్లి మాటలతో కాలక్షేపం.. భయం గుప్పెట్లో రాష్ట్రం అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శ

రాష్ట్ర హోం మంత్రి అనితను ఉద్దేశించి వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన రెండు రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డిపై మంత్రి అనిత విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి విమర్శలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదంటూ విమర్శించారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లే రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు.

ఎంపీ విజయసాయిరెడ్డి, హోం మంత్రి అనిత

MP Vijayasai Reddy and minister anitha

రాష్ట్ర హోం మంత్రి అనితను ఉద్దేశించి వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన రెండు రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డిపై మంత్రి అనిత విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి విమర్శలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదంటూ విమర్శించారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లే రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ పరిస్థితికి బాధ్యత హోం మంత్రిదేనిని స్పష్టం చేశారు. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఇది హోం మంత్రి వైఫల్యమని స్పష్టం చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి అనిత

హోం మంత్రిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామ స్పందించారు. తనదైన శైలిలో విజయ్ సాయి రెడ్డికి ఆమె కౌంటర్ ఇచ్చారు. "శాంతి"- భద్రతల విషయాల్లోరాజీనామా, మీరు చేయాలో నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదనీ, ఎన్డీయే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజలు బాగానే ఉన్నారన్న అనిత.. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, ఎక్స్ లో రెట్టలు వేస్తున్నారని విమర్శించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్