శ్రీవారి ఆలయంలో నేడు కోయిలర్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు వివరాలను వెల్లడించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

TTD Temple

టీటీడీ ఆలయం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు వివరాలను వెల్లడించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమల కార్యక్రమం సుమారు 5 గంటల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా తిరుమన కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమొక్తంగా పూజారి కార్యక్రమాలను నిర్వహించనున్నారు అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్