నీట్ ఫలితాలు విడుదలపై కీలక ఆదేశాలు.. కేంద్రాల వారిగా ఫలితాలు

నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టిఏ) కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు నగరాలు వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో పెట్టాలని సూచించింది. విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయొద్దని పేర్కొంది. నీట్ యూజీ పరీక్షలు మే 5వ తేదీన దేశ వ్యాప్తంగా జర జరగగా,పట్నా, హజారి బాగ్లలో పేపర్ లీకేజీ కేసులు నమోదయ్యాయి.

Supreme Court

 సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టిఏ) కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు నగరాలు వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో పెట్టాలని సూచించింది. విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయొద్దని పేర్కొంది. నీట్ యూజీ పరీక్షలు మే 5వ తేదీన దేశ వ్యాప్తంగా జర జరగగా,పట్నా, హజారి బాగ్లలో పేపర్ లీకేజీ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లోని గోద్రా,  మరికొన్ని ప్రాంతాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మే 5వ తేదీన జరిగిన నీటి పరీక్షను రద్దు చేయాలని, తిరిగి పరీక్షను నిర్వహించాలని కోరుతూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్టిఏ దాఖలు చేసినా వ్యాజ్యాన్ని కలుపుకొని మొత్తం 40 పిటిషన్లు కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్ లపై విచారణ చేపట్టింది. ఈ నెల 11న జరిగిన విచారణలో సిబిఐ, ఎన్టిఏ వాదనలను నమోదు చేసుకుంది. గురువారం మరో మారు విచారణ చేపట్టింది. శనివారం ఫలితాలను నగరాలు, పరీక్షా కేంద్రాలు వారీగా విడుదల చేయాలని జస్టిస్ డివై చంద్ర చూడ్ ఈ సందర్భంగా ఎన్టీఏను ఆదేశించారు.

ఈ నెల 23న మరోమారు విచారణ చేపడతామని సూచించింది. పేపర్ లీకేజీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరగలేదని అభిప్రాయం పడ్డ ధర్మాసనం.. కేవలం పట్న, హజారీబాగ్ కే పరిమితమైనట్లు వెల్లడించింది. గుజరాత్, ఇతర ప్రాంతాల్లో పేపర్ లీక్ అవ్వలేదని చెప్పలేమని పేర్కొంది. గోద్రాలో కేవలం అభ్యర్థుల తరఫున ఇతరులు ఓఎంఆర్ షీట్లను నింపినట్లు తేలిందని వివరించింది. పిటిషనర్లను ఉద్దేశించి మాట్లాడుతూ 'పేపర్ లీకేజీ అనేది దేశవ్యాప్తంగా జరగలేదు. అలా జరిగిందన్నడానికి వేరువేరు నగరాల్లో కాంటాక్ట్లను గుర్తించలేదు. లక్షల మంది విద్యార్థులు ఈ కేసు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్ష పవిత్రత, విస్తృత స్థాయిలో దెబ్బతిన్నదని గుర్తిస్తేనే మరోసారి పరీక్ష నిర్వహణకు ఆదేశాలు జారీ చేయగలం. దీనిపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. సిబిఐ ఇప్పటి వరకు మాకు చెప్పిన దర్యాప్తు వివరాలను మేం బహిర్గతం చేసాం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రశ్నాపత్రం లీకేజీ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా..? లేదా..? దేశవ్యాప్తంగా వ్యాపించిందా.? అనే విషయాలు తెలియాలంటే పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు విడుదల కీలకమని అభిప్రాయపడింది. విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలను బహిర్గతం చేయకూడదని ఎన్టిఏకు సూచించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ గురువారం పాట్నా ఎయిమ్స్ లో చదువుతున్న నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షా, రెండో సంవత్సరం విద్యార్థి కరన్ జైన్ ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్