తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత, ఆఫ్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతోపాటు శారీరక, మానసిక వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ మంది వరకూ రోజుకు 1400 మందికి దర్శనం చేయించేది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాటుకు 700 మందికి, మధ్యాహ్నం రెండు మూడు గంటలకు 700 మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత, ఆఫ్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతోపాటు శారీరక, మానసిక వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ మంది వరకూ రోజుకు 1400 మందికి దర్శనం చేయించేది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాటుకు 700 మందికి, మధ్యాహ్నం రెండు మూడు గంటలకు 700 మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు. కరోనా వైరస్ వల్ల ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ అప్పట్లో రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్ 9 నుంచి పునరుద్ధరించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండడంతో కోవిడ్ సమయంలో గుంపులుగా ఉండటం సరికాదనే కారణంతో కరెంటు బుకింగ్ను అప్పట్లో రద్దు చేశారు. అప్పటినుంచి 300 ప్రత్యేక దర్శన టికెట్లు తరహాలో టోకెన్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. ఉదయం 10 గంటల స్లాట్ రద్దు చేసి మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కు మాత్రమే వేయి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్లోకి వెళ్లే ధైర్యం చేయలేక తిరిగి వెళ్ళిపోతున్నారు. అనేక సందర్భాల్లో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన పరిస్థితుల్లో ఉన్నాయి.
మళ్లీ పునరుద్ధరణ దిశగా అడుగులు..
ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించారు. వృద్ధులు, దివ్యాంగులు సాధారణ భక్తులతో కలిసి వెళ్లడం సరికాదని చాలామందికి ఆన్లైన్ బుకింగ్ తెలియదని గ్రహించారు. ఆఫ్లైన్లోనూ టికెట్లను జారీ చేయాలని గత నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు. కాగా రానున్న మూడు నెలలకు సీనియర్ సిటిజనుల టోకెన్లు జారీ ప్రక్రియ ఆన్లైన్లో పూర్తయింది. ఆ తరువాత ఆఫ్లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి. ఎలాంటి నిబంధనలు ఉండాలి అనే అంశాలపై రెండు, మూడు వారాల్లో నిర్ణయించనున్నారు.
మార్పుపై వారాంతంలో ట్రయల్ రన్..
తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది. గతంలో విఐపి బ్రేక్ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం 5.30 గంటలకు కేటాయించేవారు. రాత్రి వేళల్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఉదయం వరద గజన దర్శనం చేయించాలని ఉద్దేశంతో గత ప్రభుత్వంలో విఐపి బ్రేక్ ను ఉదయం 10.30 గంటలకు మార్చారు. ఈ విధానంపై పలువురు విఐపి ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉదయం కళ్యాణోత్సవం, ఉదయం టైమ్ స్లాట్లు కలిగిన రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో విఐపి బ్రేక్ ను తిరిగి పూర్వ పద్ధతిలో వేకుజామున 5.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బోర్డ్ ఆదేశం మేరకు టీటీడీ అధికారులు ఆలయ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా రానున్న శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టిటిడి నిర్ణయించింది.