ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 మెయిన్స్ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఏపీపీఎస్సీ. మెయిన్స్ పరీక్షలు తేదీలను తాజాగా ఖరారు చేసింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది. మే మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఉపశమనం లభించినట్లు అయింది. మెయిన్స్ పరీక్షలను ఉదయం 10 నుంచి 1:00 వరకు రాసేలా షెడ్యూల్ విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలు నిర్వహణకు సంబంధించి నాలుగు జిల్లా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 మెయిన్స్ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఏపీపీఎస్సీ. మెయిన్స్ పరీక్షలు తేదీలను తాజాగా ఖరారు చేసింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది. మే మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఉపశమనం లభించినట్లు అయింది. మెయిన్స్ పరీక్షలను ఉదయం 10 నుంచి 1:00 వరకు రాసేలా షెడ్యూల్ విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలు నిర్వహణకు సంబంధించి నాలుగు జిల్లా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 81 గ్రూప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు మెయిన్ పరీక్షలను డిస్క్రిప్టివ్ విధానంలో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అర్హత పరీక్షలైనా తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో క్వాలిఫై కావలసి ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని కరెక్షన్ చేస్తారు.
మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇదే..
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే మే మూడో తేదీన తెలుగు అర్హత పరీక్ష జరుగుతుంది. మే 4వ తేదీన ఇంగ్లీష్ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. మే 5వ తేదీన పేపర్ 1 జనరల్ ఎస్సే పరీక్ష జరుగుతుంది. మే ఆరో తేదీన పేపర్ 2 భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, భూగోళ శాస్త్రానికి సంబంధించిన పరీక్ష జరుగుతుంది. మే 7వ తేదీన పేపర్ 3 పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, చట్టం, రాజనీతికి సంబంధించిన పేపర్ జరుగుతుంది. మే 8వ తేదీన పేపర్ ఫోర్ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి సంబంధించిన పరీక్ష జరగనుంది. మే 9వ తేదీన పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ అంశాలు, ముసలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాటు చేస్తోంది.