ఉచిత గ్యాస్ లబ్ధిదారులకు కీలక అలెర్ట్.. ఈ నెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సిందే.!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. గడచిన ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఒకటి. ఈ హామీ మేరకు ప్రతి లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని కూటమీ నాయకులు అప్పట్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల కిందట కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతగా మొదటి ఏడాది ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే అందిస్తామని కూటమి నాయకులు ప్రకటించారు. మార్చి నెలఖరులోగా ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. గడచిన ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఒకటి. ఈ హామీ మేరకు ప్రతి లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని కూటమీ నాయకులు అప్పట్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల కిందట కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతగా మొదటి ఏడాది ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే అందిస్తామని కూటమి నాయకులు ప్రకటించారు. మార్చి నెలఖరులోగా ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. మొదట వినియోగదారులు డబ్బులు చెల్లిస్తే వారికి ఆ తర్వాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని జమ చేస్తూ వస్తోంది. ఈ పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హులైన లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ పొందేందుకు అనుగుణంగా బుక్ చేసుకోవాలని సూచించింది. దీపంతో పథకంలో ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకసారి కూడా బుక్ చేసుకొని వారు ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో సూచించారు. లేదంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు గాను ఒకటి కోల్పోతారని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారంతా తొలి దశ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

దీపం-2 పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. వీరులో 94 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లో సబ్సిడీ డబ్బులు జమ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా 14,000 మందికి సబ్సిడీ అమౌంటు జమ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క సిలిండర్ కూడా బుక్ చేసుకోని వారు తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే ఈ పథకంలో భాగంగా అందించే మొదటి సిలిండర్ను నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులంతా మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే వచ్చే నెల నుంచి రెండో దశలో మిగిలిన గ్యాస్ సిలిండర్లు అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని వెల్లడించారు. రెండో దశ గ్యాస్ సిలిండర్లను పొందాలంటే మొదట దశ లో ఇస్తున్న గ్యాస్ సిలిండర్ను కూడా లబ్ధిదారులు ఉచితంగా పొందాలని సూచించారు. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది లబ్ధిదారులు అర్హులైనప్పటికీ మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదని చెబుతున్నారు. సాంకేతిక ఇబ్బందులు ఏవైనా ఉంటే స్థానిక సచివాలయాల్లో సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వం రెండోదశ రెండో గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడంతో లబ్ధిదారులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోందంటూ పలువురు పేర్కొంటున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల లక్షలాదిమంది అనర్హులు కావాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులుగా మేలుతున్న వారి సమస్యలను పరిష్కరించడం పై అధికారులు దృష్టి సారించడం లేదని పలువురు వాపోతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్