కొద్ది రోజుల కిందట జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలంటే తప్పనిసరిగా ఏదో ఒక పదవిలో ఉండాలని భావించారు. అందుకు అనుగుణంగానే రాజ్యసభకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు పంజాబ్ లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా ఆ పార్టీ ఎంపిక చేసింది.
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్
కొద్ది రోజుల కిందట జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలంటే తప్పనిసరిగా ఏదో ఒక పదవిలో ఉండాలని భావించారు. అందుకు అనుగుణంగానే రాజ్యసభకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు పంజాబ్ లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా బెస్ట్ ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి మొదట కేజ్రీవాల్ పోటీ చేసి పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ పంజాబీలు బయట వ్యక్తులను అంగీకరించారని తెలియడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రాజ్యసభ స్థానం నుంచి కేజ్రీవాల్ పోటీ చేసి రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కొద్ది రోజుల్లోనే కేజ్రివాల్ పెద్దల సభలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. సంజీవ్ అరోరా పదవీకాలం 2028 వరకు ఉంది. అప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. తద్వారా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొద్దిరోజులు కిందట జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. డబ్బు స్థానాలకు గాను బిజెపి 48 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోగా.. ఆప్ 22 స్థానాలకు పరిమితం అయింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలు అంతా ఓటమిపాలయ్యారు.. అతి శ్రీ మాత్రం అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని దక్కించుకోవడంతో ముఖ్య మంత్రిగా రేఖ గుప్తాను ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కొద్దిరోజుల కిందటే రేఖ గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.