శాసన మండలికి జనసేన నేత నాగబాబు.. ఖాళీ అయిన ఐదు స్థానాలు ఎన్నిక

ఏపీలో శాసనమండలిలో ఖాళీ అయిన ఐదు స్థానాలకు వచ్చేనెల 20 న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఐదు స్థానాలకు కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు, సీనియర్ నేతల్లో సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరు అశోక్ బాబు, బీటీ నాయుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించనున్నారు. జనసేనకు కేటాయించే స్థానాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో శాసనమండలిలో ఖాళీ అయిన ఐదు స్థానాలకు వచ్చేనెల 20 న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఐదు స్థానాలకు కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు, సీనియర్ నేతల్లో సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరు అశోక్ బాబు, బీటీ నాయుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించనున్నారు. జనసేనకు కేటాయించే స్థానాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో సీఎం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు ఒక సీటు ఖాయమైంది. మిగిలిన నాలుగు స్థానాల్లో టిడిపి అభ్యర్థులే పోటీ చేయనున్నారు. వీటి కోసం ఆ పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రాంతాలు, కులాల సమీకరణలు పరిగణలోకి తీసుకోవడంతోపాటు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారికి, వైసీపీ నుంచి వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు అటువంటి హామీని ఇచ్చారు. వీరులో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం అసెంబ్లీ సీటును త్యాగం చేసిన వర్మ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఆ నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని జన సైనికులు భావిస్తున్నారు. జనసేన నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం అయితే తప్ప వర్మకు కేటాయింపులో పెద్దగా అవరోధాలు ఉండవు. మిగిలిన మూడు స్థానాలకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మైనారిటీ కోటాలో విశాఖపట్నం కి చెందిన ఎండి నజీర్ వంటి నేతలు పోటీపడుతున్నారు. భాష్యం ప్రవీణ్ కోసం పెదకూరపాడు స్థానాన్ని కొమ్మాలపాటి, వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం సీటును దేవినేని త్యాగం చేశారు. రానున్న రోజుల్లో ఈ పోటీ దారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 28న బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత సీఎం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 21 వరకు జరగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నిక మార్చి 24 జరుగుతుంది. వైసీపీకి సభలో సంఖ్యాబలం లేకపోవడం వల్ల పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏకగ్రీవానికే ఎక్కువ అవకాశం ఉంటుందని కోటం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు బిజెపి కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం సీఎం చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే గతంలోనే ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం ఉండదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే సీనియర్ నేతల్లో ఒకరికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని బిజెపి అధిష్టానం టిడిపిని కోరుతుందని చెబుతున్నారు. బిజెపికి చెందిన ముఖ్య నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు ను ఈ విషయంపై సంప్రదింపులు చేస్తే మాత్రం ఆయన కాదనలేని పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. మరి బిజెపి నాయకులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జనసేన మాత్రం ఒక స్థానానికి పరిమితం అవుతుందని చెబుతున్నారు. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. గతంలోని ఈ సీటును కేటాయించి మంత్రి పదవిని ఆయనకి ఇవ్వాల్సి ఉంది. సంక్రాంతికి ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. అయితే అని వారి కారణాలవల్ల మంత్రివర్గంలోకి నాగబాబును చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన తరువాత తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్