జగన్నాథుడి రత్న భాండాగారం లెక్క తేలేది నేడే.. ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం

ఒడిశా రాష్ట్రం పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఆదివారం తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తరువాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిస్సా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజులపాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బిజెపి హామీ ఇచ్చింది.

puri jagannadh temple

పూరీ జగన్నాథ స్వామి ఆలయం

ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఆదివారం తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తరువాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిస్సా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజులపాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బిజెపి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. జూలై 14న భాండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 14న ఉదయం కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధీకృత సిబ్బందితోపాటు పాముల పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. నాలుగు దశాబ్దాలకుపైగా మూసి ఉన్న గదిని తెరవనుండడంతో అందులో భారీ విష సర్పాలు ఉంటాయన్న ఆందోళన నెలకొంది. ఒకవేళ విష పురుగు కాటు వేసిన సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. భాండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులంతా గత వారం రోజులుగా శాఖాహారం మాత్రమే భుజిస్తూ పూర్తి నియమనిష్టలు పాటిస్తున్నారు. ఖజానాలోని ఆభరణాలు గుర్తింపు ప్రక్రియను స్వర్ణకారులతోపాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో చేపట్టనున్నట్లు జస్టిస్ రథ్ తెలిపారు. రహస్య గదులకు ఏఎస్ఐ మరమ్మతులు చేపట్టనుండడంతో అక్కడే లెక్కింపు సాధ్యం కాదని, అందులోని సంపదను ఆలయంలోని మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించి పటిష్ట భద్రత ఏర్పాట్ల నడుమ లెక్కిస్తామని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో భద్రపరచునున్నట్లు పేర్కొన్నారు  ఈ సమయంలో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్